Marvel Movies: రైటర్స్ గిల్డ్ సమ్మెతో ఆగిన అవతార్, మార్వెల్ మూవీస్
Marvel Movies: జేమ్స్ కేమరాన్ ‘అవతార్’ సినిమా తదుపరి భాగాలు చూడాలని అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. అయితే ‘అవతార్’ సిరీస్ కు అవరోధాలు ఎదురవుతున్నాయట. ‘అవతార్’తో పాటు మార్వెల్ మూవీస్ కూ ఈ ఆటంకం తప్పటం లేదు. ఎందుకో చూద్దాం.. ‘అవతార్’ మొదటి భాగం అలరించిన స్థాయిలో ‘అవతార్’ రెండో భాగం ‘ద వే ఆఫ్ వాటర్’ ఆకట్టుకోలేకపోయింది. కానీ మొత్తం మీద వసూళ్ళలో మాత్రం మూడో స్థానంలో నిలిచింది. దాంతో అవతార్ అభిమానులలో తరువాత రాబోయే సిరీస్ చూడాలన్న ఆసక్తి పెరిగింది. నిజానికి ‘అవతార్’ మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆ తదుపరి రెండు భాగాలు 2029, 2031లో రావలసి ఉంది. అయితే అనుకున్న ప్రకారం ఈ సినిమాలు వస్తాయా? లేదా? అన్న ఆందోళన అభిమానుల్లో ఏర్పడుతోంది.
ఎందుకంటే హాలీవుడ్ లో నలభై రోజులుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ సమ్మె చేస్తోంది. దాంతో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. భారీ చిత్రాల రూపకల్పనలో ఒక్క రోజు మిస్ అయినా, ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలాంటిది నలభై రోజుల నుంచీ ఆటంకం కలగడం వల్ల నష్టం కూడా భారీగానే ఉంటుందని అంచనా!
Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో
Also Read
- Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
- Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
- Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
- Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
జేమ్స్ కేమరాన్ ‘అవతార్’ సిరీస్ కే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అలరించే మార్వెల్ మూవీస్ పై కూడా ఈ దెబ్బ పడింది. కేమరాన్ ముందుగానే 2031లోగా మిగిలిన ‘అవతార్’ మూడు భాగాలనూ విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఆయన సినిమాకు అటు ఇటయినా పెద్దగా తేడా ఉండదు. కానీ, వరుసగా ప్రేక్షకులను అలరించే పని పెట్టుకున్న మార్వెల్ మూవీస్ షూటింగ్స్ కు మాత్రం ఈ అంతరాయం వల్ల భారీ నష్టమే వాటిల్లనుంది. ‘అవతార్, మార్వెల్ మూవీస్’తో పాటు టామ్ క్రూయిజ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్టు 2’కు కూడా స్ట్రైక్ గండం ఎదురవుతోంది. అలాగే మరికొందరు టాప్ స్టార్స్ మూవీస్ కూడా రైటర్స్ గిల్డ్ స్టైక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది నిర్మాతలు, స్టూడియో అధినేతలు తమ తాజా చిత్రాల రిలీజ్ డేట్స్ ను మార్చుకుంటున్నారు. ‘కంటెంట్ కీలకం’ అంటూ దర్శకనిర్మాతలే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు – కంటెంట్ రాసే రైటర్స్ కు తగిన పారితోషికాలు ఇచ్చినప్పుడే ఈ సమ్మెకు ముగింపు పలుకుతామని రైటర్స్ అంటున్నారు. నలభై రోజులు దాటి జరుగుతున్న ఈ సమ్మె ఇంకా ఎంత కాలం సాగుతుందో, ఎన్ని సినిమాలకు సమస్యగా
మారుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో