Marvel Movies: రైటర్స్ గిల్డ్ సమ్మెతో ఆగిన అవతార్, మార్వెల్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marvel Movies: జేమ్స్ కేమరాన్ ‘అవతార్’ సినిమా తదుపరి భాగాలు చూడాలని అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. అయితే ‘అవతార్’ సిరీస్ కు అవరోధాలు ఎదురవుతున్నాయట. ‘అవతార్’తో పాటు మార్వెల్ మూవీస్ కూ ఈ ఆటంకం తప్పటం లేదు. ఎందుకో చూద్దాం.. ‘అవతార్’ మొదటి భాగం అలరించిన స్థాయిలో ‘అవతార్’ రెండో భాగం ‘ద వే ఆఫ్ వాటర్’ ఆకట్టుకోలేకపోయింది. కానీ మొత్తం మీద వసూళ్ళలో మాత్రం మూడో స్థానంలో నిలిచింది. దాంతో అవతార్ అభిమానులలో తరువాత రాబోయే సిరీస్ చూడాలన్న ఆసక్తి పెరిగింది. నిజానికి ‘అవతార్’ మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆ తదుపరి రెండు భాగాలు 2029, 2031లో రావలసి ఉంది. అయితే అనుకున్న ప్రకారం ఈ సినిమాలు వస్తాయా? లేదా? అన్న ఆందోళన అభిమానుల్లో ఏర్పడుతోంది.
ఎందుకంటే హాలీవుడ్ లో నలభై రోజులుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ సమ్మె చేస్తోంది. దాంతో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. భారీ చిత్రాల రూపకల్పనలో ఒక్క రోజు మిస్ అయినా, ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలాంటిది నలభై రోజుల నుంచీ ఆటంకం కలగడం వల్ల నష్టం కూడా భారీగానే ఉంటుందని అంచనా!
Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
- Suriya: 'హోంబాలే'తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
జేమ్స్ కేమరాన్ ‘అవతార్’ సిరీస్ కే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అలరించే మార్వెల్ మూవీస్ పై కూడా ఈ దెబ్బ పడింది. కేమరాన్ ముందుగానే 2031లోగా మిగిలిన ‘అవతార్’ మూడు భాగాలనూ విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఆయన సినిమాకు అటు ఇటయినా పెద్దగా తేడా ఉండదు. కానీ, వరుసగా ప్రేక్షకులను అలరించే పని పెట్టుకున్న మార్వెల్ మూవీస్ షూటింగ్స్ కు మాత్రం ఈ అంతరాయం వల్ల భారీ నష్టమే వాటిల్లనుంది. ‘అవతార్, మార్వెల్ మూవీస్’తో పాటు టామ్ క్రూయిజ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్టు 2’కు కూడా స్ట్రైక్ గండం ఎదురవుతోంది. అలాగే మరికొందరు టాప్ స్టార్స్ మూవీస్ కూడా రైటర్స్ గిల్డ్ స్టైక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది నిర్మాతలు, స్టూడియో అధినేతలు తమ తాజా చిత్రాల రిలీజ్ డేట్స్ ను మార్చుకుంటున్నారు. ‘కంటెంట్ కీలకం’ అంటూ దర్శకనిర్మాతలే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు – కంటెంట్ రాసే రైటర్స్ కు తగిన పారితోషికాలు ఇచ్చినప్పుడే ఈ సమ్మెకు ముగింపు పలుకుతామని రైటర్స్ అంటున్నారు. నలభై రోజులు దాటి జరుగుతున్న ఈ సమ్మె ఇంకా ఎంత కాలం సాగుతుందో, ఎన్ని సినిమాలకు సమస్యగా
మారుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!