దాసరి కుమారుడిపై అట్రాసిటీ కేసు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన బ్యాగరి నర్సింహులు(41) పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. అయితే దర్శకుడు దాసరి నారాయణరావు వద్ద 2012 నుంచి 2016 దాకా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశాడు. దాసరి మృతి తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనులను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పూర్తి చేశాడు. అయితే ఇందుకు రావాల్సిన డబ్బుల విషయంలో దాసరి కొడుకులు అరుణకుమార్, ప్రభులతో వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ఎసీసీ వద్దకు రావాలని దాసరి అరుణ్ కుమార్ చెప్పడంతో నర్సింహులు తన స్నేహితులు శ్రీనివాస్, చంటితో కలిసి వెళ్లాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అరుణ్ నర్సింహులును కులం పేరుతో దూషించగా.. ఈ నెల 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాసరి దాసరి అరుణ్ కుమార్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
తాజావార్తలు
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
-
Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!