శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. పూర్తి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్లో విడుదల చేయాలని అనుకున్నాం. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు.