యాంకర్ రష్మి.. బుల్లి తేరపై స్టార్ స్టేటస్ ను అందుకుని తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా వెండితెరపై కనిపించింది. కానీ బుల్లితెర రష్మీకి వేలాదిమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల రష్మీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన విషయాన్నీ తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ‘ గత కొన్ని రోజులుగాఆరోగ్యం బాగుండటం లేదు. నా శరీరంలో ఎదో జరుగుతోందన్న నాకు అర్ధం అవుతోంది. కొంత గ్యాప్ తీసుకోవాలని ముందుగా కమిట్ అయిన ప్రోగ్రామ్స్ ను త్వరగా ఫినిష్ చేశాను. కొద్దీ రోజుల క్రితం ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు విపరీతంగా రక్త స్రావం అవుతోంది. చివరకు తన హీమోగ్లోబిన్ స్థాయి 9శాతానికి కి పడిపోయింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.
Also Read : NTRNeel : వేటకు సిద్దమైన టైగర్.. ఫొటోస్ వైరల్
తీవ్రమైన నొప్పులతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ చేసారు వైద్యులు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను హాస్పిటల్లో చేరిన రష్మీ గత 5 రోజులుగా నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీంకు ధన్యవాదాలు’ అని తెలిపింది రష్మీ. ఇంకా కొన్ని రోజులు ఇలానే రెస్ట్ మోడ్లో ఉంటానని మాత్రం చెప్పింది. పూర్తి గా కోలుకున్నాక, ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని ఇంకో మూడు వారాలు మాత్రం ఇలాగే విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది కానీ అసలు రష్మీకి వచ్చిన అనారోగ్య కారణం ఏంటన్నది దానిపై వివరంగా చెప్పలేదు. కారణాలు ఏవైనా కానీ రష్మీ త్వరగా కోలుకుని బుల్లితెరపై మళ్ళి మెరవాలని అందరిని నవ్వించాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.