హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. మొత్తం సిటీ లో ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కే ఓటేస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది. ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్ జనాదరణ పొందిన ఓడియన్, మినీ ఓడియన్ కొన్ని సంవత్సరాల క్రితం మూసేసారు. ఆ రెండు థియేటర్స్ ను పూర్తిగా మల్టిప్లెక్స్ గా మార్చేశారు.
Also Read : Samantha: అది నా రెండో ఇల్లు.. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది
సూపర్ స్టార్ మహేష్ బాబుకు థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. AMB సినిమాస్ ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్ వంటి పెద్ద థియేటర్లతో పోటీ పడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామ్యంగా ఓడియన్ థియేటర్స్ సరికొత్త హంగులతో AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ గా 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ ప్రారంభోత్సవం జరపనుంది. సినిమాటిక్ అనుభూతికి పెంపొందించే విధంగా ఈ మల్టీప్లెక్స్ 7 విలాసవంతమైన స్క్రీన్స్ ఉంటుంది. ఫ్యాన్స్ కోసం సౌకర్యాలను మరింత పెంచుతూ, ప్రతి సీటింగ్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్లతో, ప్రతి సినిమాను థ్రిల్లింగ్ అనుభవంగా మార్చే విధంగా రూపొందించారు. ఈ అధునాతన సాంకేతికతతో ఫ్యాన్స్కు పెద్ద స్క్రీన్ మీద సినిమాను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఎగ్జెట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు.
