Bheemla Nayak Hit : జోష్ లో ఎ.ఎం.రత్నం, మైత్రీమూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వారే పవన్ తో ‘హరిహరవీరమల్లు’ చిత్రం తీస్తున్న నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్. ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్, దర్శకుడు హరీశ్ శంకర్.
Read Also : Raviteja : పేరు మార్చుకున్న మాస్ మహారాజ… ఆ సినిమా ఎఫెక్ట్ !!
Also Read
- Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
- Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
- Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
- Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
పవన్ తో గతంలో ‘ఖుషీ, బంగారం’ సినిమాలను నిర్మించిన ఎ.ఎం.రత్నం ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘హరిహరవీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ భారీ సక్సెస్ ఓ విధంగా ఊపిరి పోసిందనే చెప్పాలి. ఒకవేళ ఏదైనా అటూ ఇటూ అయితే రత్నం ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో పడి ఉండేవారన్నది వాస్తవం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సినిమా తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతోంది యూనిట్. ఇక పవన్ తో ‘గబ్బర్ సింగ్’ తీసిన హరీశ్ శంకర్ ప్రస్తుతం మైత్రీ సంస్థతో కలసి ‘భవదీయుడు భగత్ సింగ్’ రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను కూడా భారీగా ప్లాన్ చేశారు కాబట్టి ‘భీమ్లా’ వారికి మరింత భరోసా ఇచ్చేశాడు. వీరితో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలలోపు ‘హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు పూర్తి అయి విడుదల అవటం ఖాయం. ఆ సినిమాలు కూడా విజయం సాధిస్తే పవన్ కి నైతికంగా మరింత ఆసరా లభించినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
-
Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!