‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ అక్కినేని, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. తాజా నివేదిక ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” టీమ్ రేపు సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను జరుపుకోబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చిత్రబృందం ఆహ్వానించింది. రేపు హైదరాబాదులో జరగనున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్ ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారు.
Read Also : చిరంజీవి, మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు
Also Read
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించగా, గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రదీష్ వర్మ కొరియోగ్రాఫర్, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!