టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ‘మేజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ‘మేజర్’ చిత్రం 2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మేజర్’ విడుదల తేదీని ప్రకటిస్తూ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.
Read Also : పునీత్ రాజ్ కుమార్ పై అవమానకర పోస్ట్… నెటిజన్ అరెస్ట్
75 లొకేషన్లలో 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం 8 భారీ సెట్లు నిర్మించారు. అడివి శేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేజర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ‘మేజర్’లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిఎంబీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్ లపై ‘మేజర్’ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత స్వరకర్త.
#MAJOR.. In cinemas, Feb 11 2022 🙂https://t.co/ngTqFzEP3S@adivisesh @sonypicsindia @GMBents @AplusSMovies @SashiTikka #MajorOnFeb11
— Mahesh Babu (@urstrulyMahesh) November 3, 2021