Karthikeya -2: వినసొంపుగా ‘అడిగా.. నన్ను నేను అడిగా’ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ను డైరెక్ట్ చేసిన చందు మొండేటి దీన్ని తెరకెక్కించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ మూవీలోని ‘అడిగా నన్ను నేను అడిగా… నాకెవ్వరు నువ్వని’ అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఉత్తర భారతానికి సంబంధించిన అందమైన లొకేషన్స్ ను ఈ పాటలో కార్తిక్ ఘట్టమనేని అద్భుతంగా కాప్చర్ చేశాడు.
హీరోహీరోయిన్లు నిఖిల్, అనుపమతో పాటుగా శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కూడా ఈ ట్రావెల్ సాంగ్ లో కనిపిస్తారు. హృదయానికి హత్తుకునేలా ఈ పాటను కృష్ణ మద్దినేని రాయగా ఇన్నో జంగా పాడారు. శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించిన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందనేందుకు ఎన్నో ఆధారాలు ఉన్నాయని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ చెబుతోంది. ఆ నేపథ్యంలోనే గతంలో వెంకటేశ్ హీరోగా ‘దేవిపుత్రుడు’చిత్రం వచ్చింది. ఇప్పుడీ ‘కార్తికేయ -2’లోనూ అదే అంశాన్ని మరింత విభిన్నంగా దర్శకుడు చందు మొండేటి చూపించబోతున్నారని తెలుస్తోంది. జూలై 22న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేశారు.
Also Read
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!