Madhu Shalini: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్.. వరుడు ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది.
ఇక ఇటీవలే 9 అవర్స్ వెబ్ సిరీస్ లో తారకరత్న భార్యగా , జర్నలిస్ట్ గా నటించి మెప్పించిన ఈ భామ సీక్రెట్ గా వివాహమాడింది. తమిళ హీరో గోకుల్ ఆనంద్తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్లో జరిగింది. గోకుల్ ఆనంద్ కోలీవుడ్ లో చిన్న చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లలో హీరోగా నటించాడు. వీరిద్దరూ కలిసి పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సెట్స్ లోనే వీరి పరిచయం ప్రేమ వరకు వెళ్లి పెళ్ళికి దారి తీసినట్లు తెలుస్తోంది.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
ఇక పెళ్లి తరువాత మధుశాలిని తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మాకు ఇప్పటివరకు మీరు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు. ఇక నుంచి మేము ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాము” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కాగా.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?