Varalakshmi: ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వరలక్ష్మీకి షాక్… ఆ కేసులో అరెస్ట్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sarathkumar Merges Party in BJP Amid Notices to Varalakshmi: నటుడు శరత్కుమార్ అకస్మాత్తుగా తన పాలిటికల్ పార్టీని బిజెపిలో ఎందుకు విలీనం చేశారు? అని రాజకీయ వర్గాలు చురుగ్గా విశ్లేషిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోనని, మతతత్వ రాజకీయాలకు ఎప్పటికీ మద్దతివ్వబోనని చెబుతూ వచ్చిన శరత్కుమార్ గత కొన్ని నెలలుగా బీజేపీతో పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇటీవల ఆయనతో సమావేశమై.. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీతో పొత్తు ఖాయమైందని ప్రకటించారు. మరోపక్క ఆ వార్తలు మరువక ముందే మరికొద్ది రోజుల్లో తన సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. దీనిపై శరత్కుమార్ వివరణ ఇస్తూ.. పార్టీ కార్యవర్గంతో చర్చించి దేశాభివృద్ధికి, భావి యువతకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటూనే ప్రధాని మోదీ పాలనపై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్కుమార్కు ఎన్ఐఏ నోటీసులు పంపింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో వరలక్ష్మి శరత్కుమార్ మాజీ అసిస్టెంట్ ఆదిలింగం అరెస్టయ్యాడు. అతనికి డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికర్లతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
Ananya Nagalla : రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల.. వైరల్ అవుతున్న వీడియో..
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ఆదిలింగం నుంచి రూ.300 కేజీల హెరాయిన్, ఏకే 47 రైఫిల్, 9 ఎంఎం తుపాకులు, రూ.2,100 కోట్ల విలువైన మందు గుండు సామగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన నటి వరలక్ష్మి శరత్కుమార్ను కూడా విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. ఈ విచారణకు వరలక్ష్మి శరత్కుమార్కు కూడా సమన్లు అందాయని, ఎన్ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటుడు శరత్కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారని అంటున్నారు. ఈ విషయంలో వరలక్ష్మి శరత్కుమార్కు చిక్కులు వచ్చే అవకాశం ఉందని భావించి శరత్కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, క్రాక్, నాంది, వీర సింహారెడ్డి, హనుమాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటిగా సత్తా చాటుతోంది. ఆమె ఈ మధ్యనే రీసెంట్గా ఆమె ఎంగేజ్మెంట్ జరగగా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో వరలక్ష్మికి ఇలా నోటీసులు అందడం హాట్ టాపిక్ అవుతోంది. కేసులో ఆమె పాత్ర ఉందని తెలిస్తే ఆమె అరెస్ట్ కి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ విలీనం జరిగిందని అంటున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!