సంక్రాంతి వార్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఈ సంక్రాంతి వార్ గట్టిగానే ఉండబోతోంది. తెలుగు చిత్రసీమలో ఉన్న పెద్ద హీరోలంతా పొంగల్ బరిలోకి దిగేశారు. ఈసారి జనవరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు చిత్రం “సర్కారు వారి పాట”ను కూడా ముందుగా సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ తరువాత నిర్ణయం మార్చుకున్న మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చేశారు. ఇప్పుడు మిగిలిన మూడు సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగనుంది. మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడంతో ఈ సంక్రాంతి అటు ప్రేక్షకులతో పాటు నిర్మాతలకు కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను వాయిదా వేయాలంటూ నిర్మాత నాగ వంశీకి సినిమా వర్గాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా నిన్న ‘భీమ్లా నాయక్’కు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ మరోమారు కన్ఫర్మ్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ‘భీమ్లా నాయక్’ జనవరి 12న విడుదలకు సిద్ధం అవుతుండగా, ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు బుక్ చేసుకున్నారు.
Read Also : కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !
Also Read
- RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
- Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
- Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
- Toxic : 'టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
అయితే ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలూ బాక్స్ ఆఫీస్ ఫైట్ కు దిగడం అనేది అంత మంచి విషయం కాదు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అలాగే సినిమా సినిమాకూ కనీసం వారం అన్నా గ్యాప్ ఉంటే ఏ సినిమా నిర్మాతలూ నష్టపోకుండా ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న సమస్యాత్మక పరిణామాలను పరిగణలోకి తీసుకుని, వాటిని పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింది. 2022 పొంగల్ సినిమాల విడుదలకు సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం నిర్మాతల సంఘం ఈరోజు సమావేశానికి ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సమావేశంలో ఒక సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..