A Journey To Kasi: చైతన్యరావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, కేటలిన్ గౌడ ముఖ్య తారాగణంగా మునికృష్ణ దర్శకత్వంలో కె.పి. లోకనాథ్, దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి నిర్మించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. జనవరి 6 న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా శేఖర్ సూరి మాట్లాడుతూ “ఈ మూవీ టైటిల్ చాలా బాగుంది. కాశీతో నాకు మంచి అనుబంధం ఉంది. 2014లో ఓ సినిమా షూటింగ్ కోసం నేను కాశీలో 60 రోజులు ఉన్నాను. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉందనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. శుద్ధోసి బుద్ధోసి పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి కథను ఎంచుకున్న దర్శకుడు, నిర్మాతలకి నా కృతజ్ఞతలు. ఈ చిత్రానికి పని చేసిన ఎడిటర్ తిరుపతి రెడ్డి నా చిత్రాలకి పని చేశారు. మంచి టెక్నీషియన్” అని తెలిపారు.
‘శుద్ధోసి బుద్ధోసి..’ పాట పడిన సింగర్ గోమతి అయ్యర్ మాట్లాడుతూ “ఈ పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ గారికి, చిత్ర యూనిట్ సభ్యులకి నా కృతఙ్ఞతలు. ఈ చిత్రం మంచి హిట్ అవాలి” అని కోరుకున్నారు. సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఒక తెలుగు పాట, ఒక సంస్కృత గీతంతో పాటు ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాను. ఇలాంటి మంచి చిత్రంలో పని చేయటం గర్వంగా ఉంది. చైతన్యరావ్ చాలా బాగా నటించారు. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది” అని తెలిపారు. హీరోయిన్ కేటలిన్ గౌడ మాట్లాడుతూ “ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. చాలా మంచి సినిమా. కుటుంబ సభ్యులు అందరు కలిసి చూసే చిత్రం. దర్శకుడు మునికృష్ణ గారు చాలా దీనిని తెరకెక్కించారు” అని అన్నారు. దర్శకుడు మునికృష్ణ మాట్లాడుతూ ” ‘ఏ జర్నీ టు కాశీ’ చిత్రం కాశీయాత్రకు సంబంధించిన కథ. కాశీ బ్యాక్ డ్రాప్ లోని ఒక కుటుంబం కథ. ఈ చిత్రాన్ని ఓ ఎమోషనల్ డ్రామాగా, ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం” అని అన్నారు. ఈ చిత్రాన్ని చూసి ఆదరించాల్సిందిగా నిర్మాతల్లో ఒకరైన దొరడ్ల బాలాజీ కోరారు.