కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి.
ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు. దేశానికి భిక్షగా స్వాతంత్య్రం వచ్చిందని కంగనా రనౌత్ అనే మహిళ చెప్పినట్లు వార్తలు పదే పదే ప్రసారం కావడం చూశాను. ఆ మహిళకు రాష్ట్రపతి పద్మశ్రీ అందజేశారు. అది చూసిన తర్వాత నాకు విపరీతమైన కోపం వచ్చింది.నాకు 12 ఏళ్ల వయసులో గాంధీజీతో పాటు ఇంగ్లీషు విద్యను బహిష్కరించాలని డిమాండ్ చేసి ఒకరోజు జైలుకు వెళ్లాను. మాలాంటి వ్యక్తులు దాని కోసం శ్రమించిన, మేము చూసిన, మేము అనుభవించిన ప్రజల త్యాగాన్ని గుర్తించకుండా, ఈ మహిళ ‘భిక్ష’తో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పింది. ఈ ప్రకటనను నేను ఖండిస్తున్నాను. ఆమెకు బుద్ధి చెప్పాలని నేను మన గౌరవనీయమైన ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. ఆమెను జైలులో పెట్టమని నేను మిమ్మల్ని అడగడం లేదు, కానీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. దీన్ని దేశద్రోహం అంటారు. భిక్షతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని యువతకు చెబితే, వారు దాని గురించి ఏమనుకుంటారు? దేశ భవిష్యత్తు ఏమిటి? కాబట్టి ఈ ఆలోచన వ్యాప్తి చెందకుండా, ఆమెపై చర్య తీసుకోవాలి’ అంటూ ఆమె ప్రధానిని డిమాండ్ చేశారు.
Also Read
- Peddi : 'పెద్ది' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
కొన్ని రోజుల క్రితం ఓ మీడియా ఇంటరాక్షన్ లో కంగనా మాట్లాడుతూ.. భారత్కు నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే లభించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై మండిపడుతూ పలువురు రాజకీయ నాయకులు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ప్రకటన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులందరి త్యాగాలను అవమానించేలా ఉందని, ఆమెకు ఇటీవల లభించిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తనను తాను సమర్థించుకుంది. తాను తప్పు అని నిరూపిస్తే తన పద్మశ్రీని తిరిగి ఇస్తానని సవాల్ చేసింది. కంగనా పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పటి నుంచి జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు, ఎలా సద్దుమడుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!