కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి.
ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు. దేశానికి భిక్షగా స్వాతంత్య్రం వచ్చిందని కంగనా రనౌత్ అనే మహిళ చెప్పినట్లు వార్తలు పదే పదే ప్రసారం కావడం చూశాను. ఆ మహిళకు రాష్ట్రపతి పద్మశ్రీ అందజేశారు. అది చూసిన తర్వాత నాకు విపరీతమైన కోపం వచ్చింది.నాకు 12 ఏళ్ల వయసులో గాంధీజీతో పాటు ఇంగ్లీషు విద్యను బహిష్కరించాలని డిమాండ్ చేసి ఒకరోజు జైలుకు వెళ్లాను. మాలాంటి వ్యక్తులు దాని కోసం శ్రమించిన, మేము చూసిన, మేము అనుభవించిన ప్రజల త్యాగాన్ని గుర్తించకుండా, ఈ మహిళ ‘భిక్ష’తో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పింది. ఈ ప్రకటనను నేను ఖండిస్తున్నాను. ఆమెకు బుద్ధి చెప్పాలని నేను మన గౌరవనీయమైన ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. ఆమెను జైలులో పెట్టమని నేను మిమ్మల్ని అడగడం లేదు, కానీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. దీన్ని దేశద్రోహం అంటారు. భిక్షతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని యువతకు చెబితే, వారు దాని గురించి ఏమనుకుంటారు? దేశ భవిష్యత్తు ఏమిటి? కాబట్టి ఈ ఆలోచన వ్యాప్తి చెందకుండా, ఆమెపై చర్య తీసుకోవాలి’ అంటూ ఆమె ప్రధానిని డిమాండ్ చేశారు.
Also Read
- Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
- The Paradise: 'ఆయా షేర్' తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
- Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
- Mega 158 Update: 'మెగా 158' నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ 'స్వాగ్'తో బాస్ లుక్.. చూశారా?
Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
కొన్ని రోజుల క్రితం ఓ మీడియా ఇంటరాక్షన్ లో కంగనా మాట్లాడుతూ.. భారత్కు నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే లభించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై మండిపడుతూ పలువురు రాజకీయ నాయకులు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ప్రకటన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులందరి త్యాగాలను అవమానించేలా ఉందని, ఆమెకు ఇటీవల లభించిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తనను తాను సమర్థించుకుంది. తాను తప్పు అని నిరూపిస్తే తన పద్మశ్రీని తిరిగి ఇస్తానని సవాల్ చేసింది. కంగనా పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పటి నుంచి జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు, ఎలా సద్దుమడుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో