Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..
- ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం
- అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది
- ఇటీవల ఓ నివేదికలో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటకాల రుచిని పెంచడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పుల లేనిది ఏ కూరా తినలేం. రుచిని పెంచుతుంది కదా అని అధికంగా ఉప్పును తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. దాని పరిమానం మితంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదార్ధంలోనైనా ఉప్పు, పంచదార రుచిని పెంచే లవణాలు. అలాంటి అత్యంత ప్రధాన పదార్ధాలను పరిమితికి మించి ఉపయోగిస్తే ముప్పు తప్పదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరీ ముఖ్యంగా ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని పేర్కొంది. ఆహారంలో, లేదా మరే ఇతర తినే పదార్ధాల్లో అయినా ప్రతీ రోజు కేవలం 5 గ్రాములు మించి ఉప్పును తీసుకుంటే అది ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తుందని డబ్లూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పు ప్రాణానికి ముప్పుని ..డబ్లూహెచ్ వో అధ్యయనంలో తేలింది.
READ MORE: Prabas Kalki 2898 AD : థాంక్స్ డార్లింగ్స్.. కల్కి విజయంపై ప్రభాస్ వీడియో..
Also Read
- Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది మృతి చెందుతున్నారనే భయాందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. సాల్ట్ ను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశాన్ని పెంచుతుందని తెలిపింది. శరీరంలో ‘సోడియం’ కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదు. మోతాదుకు మించిన ఉప్పు శరీరంలోకి వెళ్లడం వల్ల గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతోందన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ప్రమాదం ఉందని చెబుతోంది. దీంతో పాటు అధిక రక్తపోటు సమస్య పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్, వోమ, నానబెట్టిన సబ్జ గింజలు మొదలైనవి ఆహారంలో వాడొచ్చునని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది. ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలని.. వెల్లడించింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!