Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..
- ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం
- అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది
- ఇటీవల ఓ నివేదికలో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటకాల రుచిని పెంచడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పుల లేనిది ఏ కూరా తినలేం. రుచిని పెంచుతుంది కదా అని అధికంగా ఉప్పును తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. దాని పరిమానం మితంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదార్ధంలోనైనా ఉప్పు, పంచదార రుచిని పెంచే లవణాలు. అలాంటి అత్యంత ప్రధాన పదార్ధాలను పరిమితికి మించి ఉపయోగిస్తే ముప్పు తప్పదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరీ ముఖ్యంగా ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని పేర్కొంది. ఆహారంలో, లేదా మరే ఇతర తినే పదార్ధాల్లో అయినా ప్రతీ రోజు కేవలం 5 గ్రాములు మించి ఉప్పును తీసుకుంటే అది ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తుందని డబ్లూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పు ప్రాణానికి ముప్పుని ..డబ్లూహెచ్ వో అధ్యయనంలో తేలింది.
READ MORE: Prabas Kalki 2898 AD : థాంక్స్ డార్లింగ్స్.. కల్కి విజయంపై ప్రభాస్ వీడియో..
Also Read
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది మృతి చెందుతున్నారనే భయాందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. సాల్ట్ ను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశాన్ని పెంచుతుందని తెలిపింది. శరీరంలో ‘సోడియం’ కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదు. మోతాదుకు మించిన ఉప్పు శరీరంలోకి వెళ్లడం వల్ల గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతోందన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ప్రమాదం ఉందని చెబుతోంది. దీంతో పాటు అధిక రక్తపోటు సమస్య పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్, వోమ, నానబెట్టిన సబ్జ గింజలు మొదలైనవి ఆహారంలో వాడొచ్చునని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది. ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలని.. వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!