Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..
- ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం
- అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది
- ఇటీవల ఓ నివేదికలో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటకాల రుచిని పెంచడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పుల లేనిది ఏ కూరా తినలేం. రుచిని పెంచుతుంది కదా అని అధికంగా ఉప్పును తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. దాని పరిమానం మితంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదార్ధంలోనైనా ఉప్పు, పంచదార రుచిని పెంచే లవణాలు. అలాంటి అత్యంత ప్రధాన పదార్ధాలను పరిమితికి మించి ఉపయోగిస్తే ముప్పు తప్పదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరీ ముఖ్యంగా ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని పేర్కొంది. ఆహారంలో, లేదా మరే ఇతర తినే పదార్ధాల్లో అయినా ప్రతీ రోజు కేవలం 5 గ్రాములు మించి ఉప్పును తీసుకుంటే అది ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తుందని డబ్లూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పు ప్రాణానికి ముప్పుని ..డబ్లూహెచ్ వో అధ్యయనంలో తేలింది.
READ MORE: Prabas Kalki 2898 AD : థాంక్స్ డార్లింగ్స్.. కల్కి విజయంపై ప్రభాస్ వీడియో..
Also Read
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
- Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ 'చింతపండు ఉల్లిపాయ చట్నీ' ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది మృతి చెందుతున్నారనే భయాందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. సాల్ట్ ను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశాన్ని పెంచుతుందని తెలిపింది. శరీరంలో ‘సోడియం’ కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదు. మోతాదుకు మించిన ఉప్పు శరీరంలోకి వెళ్లడం వల్ల గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతోందన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ప్రమాదం ఉందని చెబుతోంది. దీంతో పాటు అధిక రక్తపోటు సమస్య పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్, వోమ, నానబెట్టిన సబ్జ గింజలు మొదలైనవి ఆహారంలో వాడొచ్చునని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది. ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలని.. వెల్లడించింది.
తాజావార్తలు
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!