యూత్ ను ఎక్కువగా వేదిస్తున్న వాటిలో మొటిమలు కూడా ఒకటి.. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, రసాయనాలు కలిగిన లోషన్ లను, మారిన ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల చేత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు వచ్చిన చోట నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది వీటి నుండి బయటపడడానికి అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గు ముఖం పట్టదు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొని వచ్చాము.. ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాదారణంగా మొటిమలు వస్తే గిల్లడం వల్ల ఆ భాగంలో మచ్చలు, గుంతలు ఏర్పడతాయి. అలాగే మొటిమలపై ఎక్కువగా రుద్దకూడదు. నెమ్మదిగా చేత్తో రుద్దాలి. అలాగే కాటన్ వస్త్రంతో నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి 5 నుండి పది నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి… మొటిమలు సమస్య ఎక్కువగా ఉంటే తేనే తో ముఖానికి మసాజ్ చెయ్యాలి.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి మడ్ ప్యాక్ వేసుకోవాలి.. నెమ్మదిగా మొటిమల మచ్చలు తొలగిపోతాయి..
ఎప్పుడూ ఘాడమైన సబ్బులతో గట్టిగా ముఖాన్ని రుద్దడం చేస్తే మొటిమలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.. అలాగే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కూడా మొటిమల సమస్య తలెత్తుతుంది. కనుక రోజూ 4 లీటర్ల నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. సాయంత్రం విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలా పండ్ల జ్యూస్, బత్తాయి జ్యూస్ వంటి వాటిని తీసుకోవాలి.. ఫ్రెష్ వెజీటేబుల్స్ ను తీసుకోవడం కూడా మంచిదే… ఇక ఐరన్ ఉన్న ఆకు కూరలను తీసుకోవడం మంచిదే.. మొటిమలు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.