Kidney Stones: కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన చిట్కాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనేది లేదు.. రసాయనిక ఎరువుల వల్ల తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు.. మూత్రపిండాలల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చాలా మంది భావిస్తారు… అందుకోసం అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం..
మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో రణపాల ఆకు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ముందుగా ఒక రణపాల ఆకులను రోట్లో వేసి మెత్తగా దంచాలి. తరువాత ఇందులోనే 3 మిరియాలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచి ఈ మిశ్రమం నుండి రసాన్ని తీయాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల 15 నుంచి 20 రోజులలో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..
Also Read
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
అంతేకాదు మరో చిట్కా..కొండపిండి ఆకును వేర్లతో సహా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను దంచి గిన్నెలో వేసి లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఈ లీటర్ నీరు పావు లీటర్ అయ్యే వరకు బాగా మరిగించి వడకట్టాలి. తరువాత ఈ నీటిలో పటిక బెల్లం వేసి కలిపి పరగడుపున తాగాలి. ఇలా కొండపిండి ఆకుతో కషాయాన్ని తయారు చేసుకుని రోజూ అంటే ఒక వారం రోజులు తీసుకుంటే మంచిది.. రాళ్లు కరిగిపోతాయి..
చివరగా పల్లేరు కాయల తీగను తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలాసులభంగా తగ్గుతుంది. ఈ విధంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు రోజు కొద్ది రోజులు పరగడుపున తీసుకుంటే రాళ్లు పడిపోతాయి.. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.. అన్నిటికన్నా ముఖ్యమైంది నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!