jackfruit seeds : పనస తొనలు తింటున్నారా.. అయితే జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పిలువబడే పనసలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి వంటి విటమిన్లతో పాటూ, పనసపండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, రిబోఫ్లేవిన్, రాగి , మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా పనస కాయలు దొరుకుతాయి. మార్కెట్లలో, రోడ్ల మీద పనస తొనలు అమ్మడం చూస్తుంటాం. చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పనస పండు తొనలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Dil Raju : ‘హిట్ 3’ దయ వల్ల తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది..
Also Read
- Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
మూత్రపిండాల సమస్య :
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు పనస తొనలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పనస పండు తినడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా హానికరం. పనసపండు తినడం వల్ల మూత్రపిండాలలో కలిగే సమస్యను హైపర్కలేమియా అంటారు. ఇది గుండెపోటు, పక్షవాతానికి కూడా కారణమవుతుంది. సాధారణ వ్యక్తులు పనస తొనలు తినడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. కానీ కిడ్నీ రోగులు తింటే ప్రమాదం. ఎందుకంటే పొటాషియాన్ని క్లీన్ చేసే సామర్థ్యం మీ కిడ్నీలకు ఉండదు. దీంతో.. కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కనుక మూత్రపిండాల సమస్య ఉన్నవారు పనస కాయ తినకూడదు.
శస్త్రచికిత్స చేయించుకున్న వారు :
శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు లేదా, ఏదైనా శస్త్రచికిత్సకు ముందు పనస పండు తినకూడదు ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శస్త్రచికిత్స సమయంలో పనస పండు తినడం వల్ల కడుపు నొప్పి, వాపు, జీర్ణ సమస్యలు మొదలైన కడుపు సమస్యలు వస్తాయి. శస్త్రచికిత్స లేదా ఆపరేషన్కు రెండు వారాల ముందు పనస తొనలు తినకపోవడమే మేలు. కనుక డైజషన్ ప్రాబ్లం ఉన్నవారు పనసకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.
డయాబెటిస్ :
డయాబెటిస్.. ప్రజంట్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న పెను ముప్పు. ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. డయాబెటిస్తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, మధుమేహ రోగులు పనస తొనలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనసపండులో ఉండే యాంటీ-డయాబెటిక్ అంశాలు శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఒకవేళ తినాలనిపిస్తే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వృదులు మాత్రం తినకపోవడం మంచిది.
చర్మ సమస్యలు :
ఈ రోజుల్లో చాలా మంది ఏదో ఒక అలెర్జీ సమస్యలతో బాధపడుతునే ఉన్నారు. అలాంటి వారు పనస తొనలకు దూరంగా ఉండాలి. బిర్చ్ పుప్పొడి, రబ్బరు పాలుకు అలెర్జీలు ఉన్నవారు పనస పండ్లు అసలు తినకూడదు. ఈ వ్యాధి ఉన్నవారిలో పనస పండు తినడం వల్ల అలెర్జీలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట, బొబ్బలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి వారు పనస పండు తినకూడదు.
ప్రెగ్నెన్సీ సమయంలో :
ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యం అయిన ఘటం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తినే ఆహారం, తాగే అలవాట్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇందులో భాగంగా ప్రెగ్నెన్సీ సమయంలో పనస పండు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండులో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది తల్లికి, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ హానికరం. అందుకే ఈ సమయంలో పనస జోలికి వెళ్ళకూడదు. మీకు ఒకవేళ తినాలనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకుని తినాలి.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!