Blood Pressure: రోజూ తగినంత నీళ్లు తాగితే రక్తపోటు తగ్గుతుందా..? పరిశోధనలో కీలక విషయాలు..
Blood Pressure: తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది. తాజా పరిశోధనలు, వైద్యుల వివరాల ప్రకారం.. శరీరంలో నీరు తగ్గితే రక్తంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. ఇజ్రాయెల్లో జరిగిన ఓ పరిశోధన రిపోర్టు విడుదలైంది. ఇందులో నాలుగు లక్షల మందికి చెందిన ఆరోగ్య వివరాలను పరిశీలించారు. రక్తంలో సోడియం మోతాదు పెరిగితే రక్తపోటు, గుండె వైఫల్యం ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్/ఎల్ దాటినప్పుడు హైబీపీ ముప్పు దాదాపు 29 శాతం పెరుగుతుందని తేలింది.
READ MORE: Humane Sagar: బ్రేకింగ్: మేనేజర్ బలవంతం.. స్టార్ సింగర్ మృతి
Also Read
- Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
- Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
- Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
- Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ 'రాగి తీపి కుడుములు' ఇలా ట్రై చేయండి!
శరీరంలో సరైన నీటిశాతం ఉన్నప్పుడు సోడియం స్థాయిలు సహజంగానే నియంత్రణలో ఉంటాయి. మన గుండెనే తీసుకుంటే దానిలో 73 శాతం నీరు ఉంటుంది. అందుకే గుండె పనితీరును సాఫీగా కొనసాగించడానికి, రక్తం రక్తనాళాల్లో సులభంగా ప్రవహించడానికి నీరు ఎంతో అవసరం. నీరు రక్తాన్ని పలుచన చేస్తుంది. రక్తనాళాలను సడలిస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో కూడా నీరు కీలక పాత్ర పోషిస్తుంది. వైద్యుల మాటల్లో చెప్పాలంటే.. రక్తపోటు నియంత్రణకు నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ సరిపడ నీరు తాగటం ఒక చిన్న అలవాటు అయినప్పటికీ దీర్ఘకాలంలో పెద్ద మార్పును తీసుకురాగలదు.
నీటితో పాటు నిమ్మరసం, దోసకాయ నీరు, హెర్బల్ టీ, తక్కువ సోడియం సూప్, పాలు, పెరుగు వంటి వాటిని కూడా తీసుకుంటే శరీరం హైడ్రేట్గా ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు బీపీ నియంత్రణలో ఉపయోగపడతాయి. అయితే కేవలం నీటితోనే కాదు, జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే రక్తపోటును మరింత సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. బరువును నియంత్రణలో ఉంచడం, రోజూ కనీసం అరగంట వాకింగ్ చేయడం, యోగా, మెడిటేషన్ చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి సుగర్ను కంట్రోల్ చేస్తాయి. ఓ నివేదిక ప్రకారం.. సాధారణంగా మగవారు రోజుకు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్ల నీరు తాగాలని సూచించారు. కానీ ఇది వాతావరణం, పనిభారం, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇది మారుతుంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
-
White House: లాక్డౌన్లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!