Covid-19: కోవిడ్ బ్రెయిన్ డ్యామేజ్కి కారణమవుతోందా.? ప్రియాన్ వ్యాధితో వ్యక్తి మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: కోవిడ్ 19 గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వ్యాక్సినేషన్ డెవలప్ చేసినా కూడా రూపాలు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కోవిడ్ 19 దీర్ఘకాలంలో పలు సమస్యలకు కారణమవుతోంది. మెదడు, జట్టు రాలడం, అంగస్తంభన వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక ప్రియాన్ వ్యాధికి కూడా కారణం అవుతోందని, కోవిడ్ 19తో సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం.. 62 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ క్వీన్స్ హాస్పిటల్ సెంటర్లో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. క్రమక్రమంగా చిత్త వైకల్యం(డెమెన్షియా) వంటి లక్షణాలను చూపించాడు. కోవిడ్ 19 పాజిటిల్ తర్వాత ఆయన నాడీ సంబంధిత పనితీరు క్షీణించిందని పేర్కొంది. రోగికి చివరకు ప్రియాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అయితే కోవిడ్ 19 దీనికి కారణమైందా..? అనే అనుమానం కలుగుతోంది.
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
- Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
- Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
Read Also: Birthday Party: బర్త్ డే వేడుకలో పేలిన బెలూన్లు.. నలుగురు చిన్నారులకు గాయాలు..
రోగికి మెదడు పనితీరు పరిశీలించేందుకు సీటీ, ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహించారు. అయితే ఈ రెండు పరీక్షలను రెండు సార్లు నిర్వహించారు. అయితే వీటిలో ఎలాంటి వ్యాప్తి లేకుండా నార్మల్ గానే ఉన్నాయి. అయినప్పటికీ అతని పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆస్పత్రిలో చేరిన 3 వారాల తర్వాత రోగి క్రమంగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు, మెత్తని ఆహారాన్ని తినడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. 6 వారాల తర్వాత రోగి మరణించాడు. ఈ నివేదికలో వైద్యులు కోవిడ్, న్యూరోడెజెనరేటివ్ పరిస్థితుల మధ్య సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రియాన్ వ్యాధి అరుదైన న్యూరోడెజనరేటివ్ డిజార్డర్. ఇది మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా నాడీకణాల నష్టంతో సంబంధం ఉన్న లక్షణమైన స్పాంజిఫార్మ్ మార్పులను, వాపును ప్రేరేపిస్తుంది. దీంతో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. నడకలో మార్పులు, భ్రాంతి, కన్ఫ్యూషన్, కండరాల ధడత్వం తగ్గడం, అలసట, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ తర్వాత ప్రియాన్ వ్యాధితో రోగి మరణించడం ఇది మొదటిసారి కాదని నివేదికలో వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకిన తర్వాత ముగ్గురు రోగుల్లో ఇలా జరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!