Health Tips: ఫ్రిడ్జ్లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
- ఫ్రిడ్జ్లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?
- పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
ఫ్రిడ్జ్ ఉన్నదే రోజుల తరబడి ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి. కానీ కొన్నిటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఆహార పదార్థాలు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని తెలిపారు. ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు. టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల రుచి తగ్గుతుంది. అందుకే బయటే ఉంచాలని చెబుతున్నారు. బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెడితే తియ్యగా అవుతాయి.
Also Read:Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్మెంట్..
పేపర్ బ్యాగ్ లో పెట్టి స్టోర్ చేస్తే పాడవ్వవు. దోసకాయలను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పండిపోయి వాటిలో నీరు ఎక్కువగా చేరుతుంది. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే రుచిని కోల్పోయే అవకాశం ఉంది. వీటిని బయట ఉంచినా పాడవ్వవు. కాఫీ బిళ్ళలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కాఫీ రుచి మారిపోతుంది. దీని కంటే డబ్బాలో ఉంచి మూత గట్టిగా బిగిస్తే రుచి మారదు. కాజు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో కంటే బయట ఉంచడమే మంచిది. అలానే పీనట్ బటర్ 3 నెలల వరకూ పాడవదు. బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అలానే అరటి పండ్లు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో కంటే బయటే ఉంచడం బెటర్.
తాజావార్తలు
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!