Brain Tumor Risk: బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి. అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉందో తెలుసుకుందాం..
READ MORE: Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
వాస్తవానికి.. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే.. వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే.. చాలా కాలంగా రేడియేషన్ థెరపీ తీసుకున్న వారిలో, క్యాన్సర్ చికిత్స పొందిన వ్యక్తులలో మెదడు కణాలు అసాధారణంగా పెరుగుతాయి. వీరికి కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారు కూడా ప్రమాద ప్రాంతంలోకి వస్తారు. పురుగుమందులు, రబ్బరు లేదా వినైల్ క్లోరైడ్, చమురు ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక సమ్మేళనాలు వంటి రసాయన పదార్థాలతో సంబంధాలు తెంచుకోవాలి. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారికీ ఈ ప్రమాదం తప్పదు. అధిక సంతృప్త కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం కూడా బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చెడు ఆహార ఆహారం, చెడు దినచర్య, ధూమపానం లేదా వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కూడా మెదడు కణితి ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు, లి-ఫ్రామిని సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్, ట్యూబరస్ స్క్లెరోసిస్ వంటి కొన్ని జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. అంతేకాకుండా, పురుషులకు మహిళల కంటే మెదడు కణితులు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా 15 నుంచి 39 వయసు మధ్య శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అయితే వయసు బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భిన్నంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!