Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pesticides Linked To Higher Cancer Risk New Study Warns

Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..

Published Date :April 29, 2026 , 11:51 am
By RAMAKRISHNA KENCHE
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nature Health Study: ప్రస్తుతం వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయింది. తాతల కాలంలో ఎలాంటి మందులు వాడకుండా సాంప్రదాయ పద్దతిలో పంటలు పండించే వాళ్లు. కానీ.. ప్రస్తుతం క్రిమి సంహారక మందుల (Pesticides) వాడకం పెరిగిపోయింది. ఈ పురుగు మందుల వాడకం ఆందోళన కలిగిస్తోంది. ఈ మందుల వల్ల దీర్ఘకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ‘నేచర్ హెల్త్’ (Nature Health) జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఎక్కువగా ఉందని ఈ పరిశోధన హెచ్చరించింది. అంటే వ్యవసాయ క్షేత్రంలో నివసించే వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువట. టౌలౌస్ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నియోప్లాస్టిక్ డిసీజెస్ వంటి సంస్థలు కలిసి నిర్వహించిన ఈ అధ్యయనం, రసాయన భద్రతా ప్రమాణాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపింది.

సాధారణంగా గతంలో జరిగిన పరిశోధనలు ఏదో ఒక రసాయనం వల్ల కలిగే ప్రభావాన్ని మాత్రమే విశ్లేషించేవి. కానీ ఈ అధ్యయనం, నిజ జీవితంలో మనుషులు ఒకే సమయంలో అనేక రకాల రసాయనాల మిశ్రమానికి గురవుతారనే కోణంలో సాగింది. పెరూ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులు, సామాజిక-ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని ఈ పరిశోధన చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఒకేసారి సగటున 12 రకాల పురుగుమందుల ప్రభావానికి లోనవుతున్నారని, తద్వారా వారు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు 2014-2019 మధ్య కాలంలో సాధారణంగా వాడే 31 రకాల పురుగుమందుల వ్యాప్తిని పరిశీలించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వీటిని క్యాన్సర్ కారకాలుగా ఇప్పటి వరకు గుర్తించలేదు. అయినప్పటికీ, 2007-2020 మధ్య కాలంలో సుమారు 1.5 లక్షల మంది క్యాన్సర్ రోగుల వివరాలను విశ్లేషించగా, పురుగుమందుల వాడకం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే క్యాన్సర్ కేసులు గణనీయంగా నమోదైనట్లు తేలింది.

Also Read

  • Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
  • Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!

పురుగుమందులు శరీరంలోని కణజాల ప్రక్రియలను దెబ్బతీస్తాయని, దీనివల్ల క్యాన్సర్ వ్యాధి సోకక ముందే శరీరంలో మార్పులు మొదలవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా విషతుల్యాలను శుద్ధి చేసే కాలేయం (Liver) దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీనివల్ల శరీరం ఇతర ఇన్ఫెక్షన్లు, ఒత్తిడికి త్వరగా లోనవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ‘ఎల్ నినో’ వంటి పరిణామాలు సైతం ఈ రసాయనాలు పర్యావరణంలో వేగంగా వ్యాపించడానికి కారణమవుతున్నాయి. ఇక ఈ అధ్యయనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కేవలం ఒక్క రసాయనం వల్ల కాకుండా, పలు రసాయనాల మిశ్రమం వల్ల కలిగే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతమున్న భద్రతా నిబంధనలు పాతబడిపోయాయట. రసాయనాల మిశ్రమ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త నిబంధనలు రూపొందించాలని అధ్యయనం సూచించింది. ఈ అధ్యయనం పెరూ దేశంలో జరిపినప్పటికీ.. ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇది వర్తిస్తుంది. ఈ అధ్యయనం పర్యావరణ ఆరోగ్యంపై మన అవగాహనను మార్చడంతో పాటు, పురుగుమందుల వాడకంపై మరింత కఠినమైన పర్యవేక్షణ, మెరుగైన ప్రజా ఆరోగ్య విధానాలు అవసరమని స్పష్టం చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture chemicals
  • cancer risk farming areas
  • cancer study
  • environmental health
  • Health News

తాజావార్తలు

  • Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..

  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

  • IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

  • MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions