Bird Flu: 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. పులులు, సింహాలకు సైతం వైరస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025లో భారతదేశంలో ప్రధానంగా 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘెల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పులి, సింహం, చిరుతపులి, పెంపుడు పిల్లులు వంటి పక్షులేతర జాతులలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని నిర్ధారించారు. ఇది సాధారణంగా ఊహించిన దానికంటే విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇది మానవులకు సైతం వ్యాప్తి చెందుతోందని రిపోర్టు ద్వారా తెలిపారు.
READ MORE: Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
రిపోర్టు ప్రకారం.. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే, 2025 లో H9N1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ)) వైరస్ వ్యాప్తి తక్కువగా నమోదైంది. జూలై 24 వరకు, ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. 2024లో 49 కేసులు నమోదు కాగా.. గత ఐదేళ్లలో అత్యధిక కేసులు 2021లో(118) నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దేశీయ కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైంది. పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి, నివారణ, నిఘా, వేగవంతం చేశాం. బయోసెక్యూరిటీ చర్యల అమలు వంటి వాటికి సమగ్ర మార్గదర్శకాలను అందించడానికి ప్రభుత్వం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను (సవరించిన 2021) రూపొందించింది. వన్యప్రాణులు, ఆరోగ్య అధికారుల సమన్వయంతో అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో నిఘాను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సలహాలు జారీ చేశారు. వ్యాధి రహిత, స్థితిస్థాపక పౌల్ట్రీ రంగాన్ని నిర్మించడానికి పౌల్ట్రీ డిసీజ్ యాక్షన్ ప్లాన్ అభివృద్ధి చేశారు. ఈ వ్యాధితో కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ యజమానులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్య ప్రాతిపదికన ఆర్థికంగా సహాయం చేస్తాయి.
READ MORE: ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!