Bird Flu: 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. పులులు, సింహాలకు సైతం వైరస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025లో భారతదేశంలో ప్రధానంగా 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘెల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పులి, సింహం, చిరుతపులి, పెంపుడు పిల్లులు వంటి పక్షులేతర జాతులలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని నిర్ధారించారు. ఇది సాధారణంగా ఊహించిన దానికంటే విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇది మానవులకు సైతం వ్యాప్తి చెందుతోందని రిపోర్టు ద్వారా తెలిపారు.
READ MORE: Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
రిపోర్టు ప్రకారం.. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే, 2025 లో H9N1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ)) వైరస్ వ్యాప్తి తక్కువగా నమోదైంది. జూలై 24 వరకు, ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. 2024లో 49 కేసులు నమోదు కాగా.. గత ఐదేళ్లలో అత్యధిక కేసులు 2021లో(118) నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దేశీయ కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైంది. పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి, నివారణ, నిఘా, వేగవంతం చేశాం. బయోసెక్యూరిటీ చర్యల అమలు వంటి వాటికి సమగ్ర మార్గదర్శకాలను అందించడానికి ప్రభుత్వం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను (సవరించిన 2021) రూపొందించింది. వన్యప్రాణులు, ఆరోగ్య అధికారుల సమన్వయంతో అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో నిఘాను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సలహాలు జారీ చేశారు. వ్యాధి రహిత, స్థితిస్థాపక పౌల్ట్రీ రంగాన్ని నిర్మించడానికి పౌల్ట్రీ డిసీజ్ యాక్షన్ ప్లాన్ అభివృద్ధి చేశారు. ఈ వ్యాధితో కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ యజమానులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్య ప్రాతిపదికన ఆర్థికంగా సహాయం చేస్తాయి.
READ MORE: ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!