గంగా నదిలో మృతదేహాలు… ఆ నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా ?
గంగా నదిలో తేలుతున్న కరోనా మృతదేహాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్లోని నది నుంచి 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 100కు పైగా మృతదేహాలను నదిలో పారేసినట్లు స్థానిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీంతో మృతదేహాల ద్వారా, నదుల ద్వారా కోవిడ్ -19 వ్యాప్తి చెందుతుందా ? అనే భయాందోళనలు మొదలయ్యాయి అందరిలో. కోవిడ్ -19 సోకిన మృతదేహం ద్వారా కరోనా సోకుతుందా ? లేదా ? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదొక అపోహ మాత్రమేనని నిపుణులు కొట్టి పారేసినప్పటికీ కోవిడ్ -19 కేసులలో మృతదేహాల విషయంలో అధికారులు ప్రోటోకాల్ను పాటిస్తున్నారు. భారతదేశంలోని ఆరోగ్య సంస్థలు కోవిడ్ -19తో మృతి చెందిన మృతదేహాల నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జారీ చేసిన మార్గదర్శకాలు మృతదేహాలను నిర్వహించడంలో కరోనావైరస్ సంక్రమణకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మాస్క్, కళ్ళజోడు, శానిటైజర్, మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్ను క్రిమిసంహారకాలతో క్లీన్ చేయడం, వ్యక్తిగత రక్షణ (పిపిఇ) కిట్ల వాడకాన్ని వారు సూచిస్తున్నారు.
అయితే యుఎస్లో ప్రోటోకాల్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) మృతదేహం నుండి కోవిడ్-19 సోకే ప్రమాదం లేదని నమ్ముతున్నారు. అయినప్పటికీ అక్కడ కుటుంబ సభ్యులు కరోనా మృతదేహాన్ని చూడాలంటే కనీసం ఒకరికొకరు 1 మీటర్ దూరంలో ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరూ అసలు బాడీని ముట్టుకోవద్దు.
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
ఆరోగ్య నిపుణులు చెప్పేదాని ప్రకారం కోవిడ్ -19 కి కారణమయ్యే కరోనావైరస్ అయిన SARS-CoV-2 దగ్గు, తుమ్ము, శ్వాస, ఒకరితో ఒకరు మాట్లాడే సమయంలో నోట్లోంచి లేదా ముక్కులో నుంచి వెలువడే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని బిందువులు చాలా చిన్నవి. వాటిని ఏరోసోల్స్ అని పిలుస్తారు. అవి రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం గాలిలోకి వెళ్లగలవు. దీని అర్థం కరోనావైరస్ సోకిన వ్యక్తి ద్వారా నీటిలో కూడా కరోనా వైరస్ ఉంటుంది. కొన్ని అధ్యయనాలు కరోనా సోకిన వ్యక్తుల మల పదార్థంలో కరోనావైరస్ ఆధారాలను కనుగొన్నాయి. శరీర ద్రవాలద్వారా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందుతుంది. అయితే నీరు, ఈత కొలను SARS-CoV-2 కు ప్రసార మార్గంగా ఉంటాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. “కోవిడ్ -19 వైరస్ ఈత కొట్టేటప్పుడు నీటి ద్వారా వ్యాపించదు. కానీ ఎవరైనా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటే వైరస్ వ్యాపిస్తుంది” అని WHO చెబుతోంది,
కరోనా సోకిన మృతదేహాలను నదిలో వేస్తే కోవిడ్ -19 వ్యాపిస్తుందా ? ఇది జలచరాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా ? దీనివల్ల ఒక జాతి నుండి మరొక జాతికి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందా ? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే కరోనా సోకిన మృతదేహాలను నదిలో వేయడం వల్ల గంగాలో కాలుష్య స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే మృతదేహాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఏదేమైనా గంగాలో ఇలా మృతదేహాలు తేలడం అనేది ఆందోళనకర విషయమే.
తాజావార్తలు
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంటె సంగతులు అని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!