గంగా నదిలో మృతదేహాలు… ఆ నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంగా నదిలో తేలుతున్న కరోనా మృతదేహాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్లోని నది నుంచి 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 100కు పైగా మృతదేహాలను నదిలో పారేసినట్లు స్థానిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీంతో మృతదేహాల ద్వారా, నదుల ద్వారా కోవిడ్ -19 వ్యాప్తి చెందుతుందా ? అనే భయాందోళనలు మొదలయ్యాయి అందరిలో. కోవిడ్ -19 సోకిన మృతదేహం ద్వారా కరోనా సోకుతుందా ? లేదా ? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదొక అపోహ మాత్రమేనని నిపుణులు కొట్టి పారేసినప్పటికీ కోవిడ్ -19 కేసులలో మృతదేహాల విషయంలో అధికారులు ప్రోటోకాల్ను పాటిస్తున్నారు. భారతదేశంలోని ఆరోగ్య సంస్థలు కోవిడ్ -19తో మృతి చెందిన మృతదేహాల నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జారీ చేసిన మార్గదర్శకాలు మృతదేహాలను నిర్వహించడంలో కరోనావైరస్ సంక్రమణకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మాస్క్, కళ్ళజోడు, శానిటైజర్, మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్ను క్రిమిసంహారకాలతో క్లీన్ చేయడం, వ్యక్తిగత రక్షణ (పిపిఇ) కిట్ల వాడకాన్ని వారు సూచిస్తున్నారు.
అయితే యుఎస్లో ప్రోటోకాల్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) మృతదేహం నుండి కోవిడ్-19 సోకే ప్రమాదం లేదని నమ్ముతున్నారు. అయినప్పటికీ అక్కడ కుటుంబ సభ్యులు కరోనా మృతదేహాన్ని చూడాలంటే కనీసం ఒకరికొకరు 1 మీటర్ దూరంలో ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరూ అసలు బాడీని ముట్టుకోవద్దు.
Also Read
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ఆరోగ్య నిపుణులు చెప్పేదాని ప్రకారం కోవిడ్ -19 కి కారణమయ్యే కరోనావైరస్ అయిన SARS-CoV-2 దగ్గు, తుమ్ము, శ్వాస, ఒకరితో ఒకరు మాట్లాడే సమయంలో నోట్లోంచి లేదా ముక్కులో నుంచి వెలువడే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని బిందువులు చాలా చిన్నవి. వాటిని ఏరోసోల్స్ అని పిలుస్తారు. అవి రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం గాలిలోకి వెళ్లగలవు. దీని అర్థం కరోనావైరస్ సోకిన వ్యక్తి ద్వారా నీటిలో కూడా కరోనా వైరస్ ఉంటుంది. కొన్ని అధ్యయనాలు కరోనా సోకిన వ్యక్తుల మల పదార్థంలో కరోనావైరస్ ఆధారాలను కనుగొన్నాయి. శరీర ద్రవాలద్వారా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందుతుంది. అయితే నీరు, ఈత కొలను SARS-CoV-2 కు ప్రసార మార్గంగా ఉంటాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. “కోవిడ్ -19 వైరస్ ఈత కొట్టేటప్పుడు నీటి ద్వారా వ్యాపించదు. కానీ ఎవరైనా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటే వైరస్ వ్యాపిస్తుంది” అని WHO చెబుతోంది,
కరోనా సోకిన మృతదేహాలను నదిలో వేస్తే కోవిడ్ -19 వ్యాపిస్తుందా ? ఇది జలచరాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా ? దీనివల్ల ఒక జాతి నుండి మరొక జాతికి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందా ? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే కరోనా సోకిన మృతదేహాలను నదిలో వేయడం వల్ల గంగాలో కాలుష్య స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే మృతదేహాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఏదేమైనా గంగాలో ఇలా మృతదేహాలు తేలడం అనేది ఆందోళనకర విషయమే.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?