Lancet study: షాకింగ్ స్టడీ.. 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lancet study: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ముప్పు పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నాన్ -కమ్యూనికేట్ వ్యాధుల భారం చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ఇప్పటికే 10.1 కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉంది. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. తాజాగా ది లాన్సెట్ పరిశోధనలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 13.4 శాతం అంటే దాదాపుగా 130 కోట్ల మందికి డయాబెటిస్ వ్యాధి ఉంటుందని హెచ్చరించింది.
Read Also: Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
ఇది ప్రస్తుతం 2021లో ఉన్న 52.9 కోట్ల కంటే రెట్టింపు. రాబోయే 30 ఏళ్లలో ఏ దేశంలో కూడా వయస్సు-ప్రామాణిక మధుమేహం రేట్స్ తగ్గుముఖం పట్టడని అధ్యయనం పేర్కొంది. అవగాహన, మధుమేహాన్ని అణిచేందుకు ప్రయత్నాలు జరగుతున్నప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధుల్ని షుగర్ వ్యాధి అధిగమిస్తోంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో కూడా మధుమేహ వ్యాధి, అనారోగ్యం, మరణాల రేట్లు పెరుగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. 2045 నాటికి మధుమేహం ఉన్నవారిలో మూడొంతుల మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తారని అంచనా వేసింది. వీరిలో 10 మందిలో ఒకరు మాత్రమే సమగ్ర మధుమేహ సంరక్షణను అందుకుంటారని పేర్కొంది. పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం.. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అసమానతలను పెంచింది.
డయాబెటిక్ అనేది ప్రస్తుత కాలంలో అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులో ఒకటని.. రాబోయే మూడు దశాబ్ధాల్లో ప్రతీ దేశంలో వయసు, లింగం, వర్గం అనే భేదం లేకుండా దూకుడుగా అభివృద్ధి చెందుతుందని ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకి తీవ్రమైన సవాల్ గా నిలుస్తుందని పరిశోధకులు తెలిపారు. ఏడేళ్లలోపు నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల్ని 30 శాతం తగ్గించేందుకు, అట్టడుగు జనాభా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాని యూఎన్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మధుమేహం అసమాతనపై కీలక దృష్టి, అవగాహన అవసరం అని పరిశోధకురాలు శివానీ అగర్వాల్ (ఫ్లీషర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటిస్ అండ్ మెటబాలిజం) వెల్లడించారు.
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!