Lancet study: షాకింగ్ స్టడీ.. 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lancet study: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ముప్పు పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నాన్ -కమ్యూనికేట్ వ్యాధుల భారం చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ఇప్పటికే 10.1 కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉంది. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. తాజాగా ది లాన్సెట్ పరిశోధనలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 13.4 శాతం అంటే దాదాపుగా 130 కోట్ల మందికి డయాబెటిస్ వ్యాధి ఉంటుందని హెచ్చరించింది.
Read Also: Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
ఇది ప్రస్తుతం 2021లో ఉన్న 52.9 కోట్ల కంటే రెట్టింపు. రాబోయే 30 ఏళ్లలో ఏ దేశంలో కూడా వయస్సు-ప్రామాణిక మధుమేహం రేట్స్ తగ్గుముఖం పట్టడని అధ్యయనం పేర్కొంది. అవగాహన, మధుమేహాన్ని అణిచేందుకు ప్రయత్నాలు జరగుతున్నప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధుల్ని షుగర్ వ్యాధి అధిగమిస్తోంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో కూడా మధుమేహ వ్యాధి, అనారోగ్యం, మరణాల రేట్లు పెరుగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. 2045 నాటికి మధుమేహం ఉన్నవారిలో మూడొంతుల మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తారని అంచనా వేసింది. వీరిలో 10 మందిలో ఒకరు మాత్రమే సమగ్ర మధుమేహ సంరక్షణను అందుకుంటారని పేర్కొంది. పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం.. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అసమానతలను పెంచింది.
డయాబెటిక్ అనేది ప్రస్తుత కాలంలో అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులో ఒకటని.. రాబోయే మూడు దశాబ్ధాల్లో ప్రతీ దేశంలో వయసు, లింగం, వర్గం అనే భేదం లేకుండా దూకుడుగా అభివృద్ధి చెందుతుందని ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకి తీవ్రమైన సవాల్ గా నిలుస్తుందని పరిశోధకులు తెలిపారు. ఏడేళ్లలోపు నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల్ని 30 శాతం తగ్గించేందుకు, అట్టడుగు జనాభా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాని యూఎన్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మధుమేహం అసమాతనపై కీలక దృష్టి, అవగాహన అవసరం అని పరిశోధకురాలు శివానీ అగర్వాల్ (ఫ్లీషర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటిస్ అండ్ మెటబాలిజం) వెల్లడించారు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!