Health Tips: రాత్రి భోజనం తర్వాత ఆ తప్పులు చేశారో ఇక అంతే సంగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టైం కు తినాలి.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి భోజనం తీసుకున్న కొన్ని తప్పులు చేస్తే భారీ ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. అస్సలు భోజనం చేసిన తర్వాత చెయ్యక ముందు ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి, నిశ్చలతకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెంచుతుంది… రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే.. కడుపులో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఆగిపోతుంది. మనం నిలబడి లేదా కూర్చున్నప్పుడు, గురుత్వాకర్షణ కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ పడుకున్నప్పుడు.. ఈ ప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కాదు. ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడవాలి లేదా కాసేపు కూర్చుని మాట్లాడాలి.. అప్పుడే ఫుడ్ జీర్ణం అవుతుందని నిపుణులు అంటున్నారు..
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
రాత్రి భోజనం తర్వాత నీరు త్రాగడం అనేది జీర్ణక్రియకు సహాయపడటానికి ప్రజలు తరచుగా చేసే ఒక సాధారణ అపోహ, కానీ వాస్తవానికి ఇది మనకు ప్రయోజనకరం కాదు. రాత్రి భోజనం తర్వాత నీరు త్రాగడం కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.. అందుకే ఇరవై నిమిషాలు లేదా గంట ఆగి నీటిని తీసుకోవడం మంచిది..
చాలా మందికి సాధారణమైన అలవాటు, కానీ అది మన జీర్ణవ్యవస్థకు మంచిది కాదు. రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడం కడుపులో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే పండ్లలో ఫైబర్, చక్కెర ఉంటాయి.. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఇది కాకుండా, పియర్, మామిడి మొదలైన కొన్ని పండ్లలో అధిక ఆమ్లత్వం ఉంటుంది.. ఇది అసిడిటీని కలిగిస్తుంది.. వీటిని కూడా తిన్న గంట తర్వాత తీసుకోవడం మంచిది..
చాలా మందికి రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ అది మన జీర్ణవ్యవస్థకు మంచిది కాదు. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.. జీర్ణ క్రియ కూడా సరిగ్గా జరగదు.. అందుకే వీటికి దూరంగా ఉండటం బెస్ట్..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!