Health Risks : రెగ్యులర్ గా పళ్లు తోమకపోతే ఏమవుతుందో తెలుసా..
- పళ్లు తోమకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
- పళ్లు సరిగా తోమకపోతే గుండె జబ్బుల ప్రమాదం..
- మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర అయిన ఎమినల్ను నెమ్మదిగా కరిగిస్తుందంటున్నారు. ఆహారం తీసుకున్న 4–6 గంటల్లోపే దంతాలపై ప్లాక్ అనే జిగట పొర ఏర్పడుతుంది. ఇది 12 గంటల తర్వాత గట్టిపడి టార్టర్ గా మారుతుందని.. దీంతో 24 గంటల తర్వాత చిగుళ్లు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఒక్క రోజు కూడా పళ్లు తోమకపోతే నోటిలో ఒక మిలియన్కు పైగా బ్యాక్టీరియా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
నిరంతరం పళ్లు తోమకపోతే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని డెంటిస్ట్ లు చెబుతున్నారు.. ఒక అధ్యయనం ప్రకారం రోజూ పళ్లు తోమని వ్యక్తులకు వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదం సుమారు 25 శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం పాటు పళ్లు సరిగా తోమకపోతే గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నోటిలో పెరిగే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా వంటి వ్యాధులకు కూడా దారితీయవచ్చని వారు చెబుతున్నారు.
పొగాకు వాడకపోయనా పళ్లు తోముకోకుండా ఉండే వారికి నోటి క్యాన్సర్ ప్రమాదం కూడా కొంతవరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. సంవత్సరం పాటు పళ్లు తోమకుండా ఉంటే, దంతాలు తీవ్రమైన కుళ్ళు, కుహరాలు, పుండ్లు, అధిక నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది చిగుళ్ల వ్యాధికి కారణమై, చివరికి పళ్లు వదులై ఊడిపోయే ప్రమాదం ఉంది.అందుకే డెంటిస్ట్లు ప్రతిరోజూ రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యానికే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే డెంటిస్ట్ ని కలిసి సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!