Meat Consumption: ప్రతీ ఏడాది 100 బిలియన్ల జంతువుల్ని తింటున్న మనుషులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meat Consumption: మాంసాహారం, శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం. అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనం బెటర్ అని చెబుతుంటారు. ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాంసం తినాలని సూచిస్తుంటారు. చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతుంటారు. ఇటీవల కాలంలో మనదేశంలో కూడా మాంసాహారం తీసుకోవడం పెరిగింది. ఇదిలా ఉంటే ది ఎకనామిస్ట్లోని పాత రిపోర్టు ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మాంసాహార రిపోర్టును చూస్తే దిమ్మతిరగాల్సిందే. ప్రతీ ఏడాది భూమిపై ఉండే మనుషులు 100 బిలియన్లు(10,000 కోట్ల) జంతువులను తింటున్నారని నివేదిక తెలిపింది.
Read Also: Pakistan: వైవాహిక అత్యాచారం కేసులో పాక్ కోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని ఊహిస్తామా..?
Also Read
- Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
- Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
- Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్గా ఇలా చేసుకోండి..!
ది ఎకనామిస్ట్లోని పాత నివేదిక ప్రకారం, వ్యవసాయ జంతువులు – కోళ్లు (19 బిలియన్లు), ఆవులు (1.5 బిలియన్లు), గొర్రెలు (1 బిలియన్లు) మరియు పందులు (1 బిలియన్లు) ఏడాదికి తింటున్నారు. మానవులు తినే జంతువుల సంఖ్య భూమిపై ఉన్న మానవులకు కొన్ని రెట్లు అధికంగా ఉంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అన్ని జంతువుల్లో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతీ రోజూ 20.5 కోట్ల కోళ్లను తింటున్నారు. ప్రతీ నిమిషానికి 1,40,000 కంటే ఎక్కువ కోళ్లు వధించబడుతున్నాయి. ప్రతీ ఏడాది 14 బిలియన్ల చేపల్ని, 3 బిలియన్ల రొయ్యల్ని, 2.9 బిలియన్ల బాతుల్ని తింటున్నట్లు వీడియో వెల్లడిస్తుంది. ఇవే కాకుండా ప్రతీ ఏడాది రెండు బిలియన్ల ఆక్టోపస్లని, 100 మిలియన్ల సొరచేపల్ని తింటున్నాం. 1.5 బిలియన్ల పందుల్ని వధిస్తున్నాము. గత 50 ఏళ్లలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
ఎక్కువగా మాంసం డిమాండ్ చైనాలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఇఎఫ్) తన నివేదికలో తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా ఉంది. దీనికి విరుద్ధంగా యూరప్, అమెరికాలో వినియోగం స్టేబుల్గా ఉంది. జనాభా పరంగా చైనాతో పోటీ పడుతున్న భారత్లో మాత్రం మాంసం తక్కువగా వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. రెడ్ మీట్లో బీఫ్ గత 50 ఏళ్లలో దాని వాటా సగానికి పడిపోయి 22 శాతానికి చేరుకుందని తెలిపింది. ఇది గొర్రె మాంసం కన్నా 5 రెట్లు ప్రజాదరణ పొందింది.
Unbeliavable! Total number of animals eaten by people globally🧐
— Tansu Yegen (@TansuYegen) January 21, 2024
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..