Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tea and Biscuits: ఉదయం లేవగానే ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తినడం చాలా మందికి అలవాటు. ఖాళీ కడుపుతో టీ తాగితే అసౌకర్యంగా ఉంటుందని భావించి, చాలామంది టీతో పాటు బిస్కెట్లు తీసుకుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందా? అనే ప్రశ్నకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఎండోక్రినాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ ఖడ్గవత్ వివరణ ఇచ్చారు. చాలా బిస్కెట్లలో లాక్టోస్, గ్లూకోజ్, శుద్ధి చేసిన పిండి మరియు అదనపు చక్కెరలు ఉంటాయి. కొన్ని ఫ్లేవర్డ్ బిస్కెట్లలో దాగి ఉన్న చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో కేలరీలను పెంచి, కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి. అదే సమయంలో తీపి కలిపిన టీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
బిస్కెట్లు తినడం వల్ల కళ్లకు కూడా హాని..!
ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వ్యక్తుల్లో ఈ అలవాటు మధుమేహం వచ్చే అవకాశాలను పెంచవచ్చు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు అప్పుడప్పుడు టీ, బిస్కెట్లు తీసుకుంటే ప్రమాదం తక్కువగా ఉండొచ్చని చెప్పారు. కానీ ఊబకాయం, అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. బిస్కెట్ల అధిక వినియోగం కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పబ్మెడ్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, బిస్కెట్ల వినియోగం మరియు డయాబెటిక్ రెటినోపతి ప్రమాదం మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ బిస్కెట్లు తినే మధుమేహ రోగుల్లో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
Also Read
- Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
- Crispy Drumstick Fry Recipe: మునగకాయతో క్రిస్పీ స్నాక్.. రెసిపీ సింపుల్!
షుగర్ లేని బిస్కెట్లు తినవచ్చా?
చాలామంది చక్కెర లేని బిస్కెట్లు సురక్షితమని భావిస్తారు. అయితే డాక్టర్ రాజేష్ ప్రకారం, బిస్కెట్లో చక్కెర లేకపోయినా, శుద్ధి చేసిన పిండి మాత్రం ఉంటుంది. దాన్ని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల బిస్కెట్ కొనుగోలు చేసే ముందు దానిపై ఉన్న పోషక విలువల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన సూచించారు.
అల్పాహారంగా ఏమి తీసుకోవడం బెటర్..?
అల్పాహారంగా బిస్కెట్లకు బదులుగా పోషకాహారాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన శనగలు, తామర గింజలు, వేరుశెనగలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఉదయపు అల్పాహారంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని చేర్చడం ద్వారా మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!