Foods for Kids: పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినిపించండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foods for Kids: చదివినవి బాగా గుర్తు పెట్టుకుంటే పరీక్షలు రాయొచ్చు. పిల్లలకు చదివినవి సరిగా గుర్తుండవు, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. ఇందుకోసం వారికి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి. రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల జ్ఞాపకశక్తిపై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ప్రత్యేక ఆహారాలు తినిపించడం వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఎరుపు ద్రాక్ష, నీలం, ఊదా బెర్రీలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటి నుంచి తీసిన రసాన్ని పిల్లలకు రోజూ తాగిస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. అల్జీమర్స్తో బాధపడుతున్న వృద్ధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఒక అధ్యయనం పెద్దలకు 12 వారాల పాటు రోజుకు ఒక గ్లాసు ద్రాక్ష లేదా బెర్రీ జ్యూస్ ఇచ్చింది. దానివల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరిగిందని పరిశోధకులు గుర్తించారు.
తాజా బ్లూబెర్రీస్ తినిపించడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. దానివల్ల చదువు బాగా వస్తుంది. ద్రాక్ష, బెర్రీలలో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఆంథోసైనిన్స్ అనే పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మెదడుకు పుష్కలంగా పోషకాలు, ఆక్సిజన్ను అందిస్తాయి, ఇది వేగంగా పని చేస్తుంది. నరాలు ఉత్తేజితమవుతాయి. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా చూసుకోండి. ఇది రోజంతా సాధారణ జీవక్రియలో సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తి పెంచడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తినే వ్యక్తులు చదువులో మెరుగ్గా రాణిస్తారని కూడా ఓ అధ్యయనం వెల్లడించింది. చేపలను తినడం కూడా ముఖ్యం. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తినడం వల్ల అల్జీమర్స్, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తాయి. వారానికి కనీసం రెండు మూడు సార్లు చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, వాల్నట్లను కూడా రోజూ పిల్లలకు తినిపించాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు సెలీనియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయి. నరాలు సక్రమంగా పనిచేయడానికి ఇవన్నీ చాలా అవసరం. అవి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. పిల్లలకు ఈ పండ్ల రసాలతో పాటు ఇతర ఆహార పదార్థాలను తినిపించాలి. బ్రౌన్ రైస్ పెద్దలకే కాదు పిల్లలకు కూడా మంచిది. గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలకు కూడా బ్రౌన్ రైస్ తినిపించాలి. రోజూ గుడ్డు తినిపించడం మర్చిపోవద్దు. ఇందులో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది గ్రహణశక్తిని పెంచుతుంది. ఇది మెదడులో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వాటిని పిల్లలకు తినిపించడం వలనల వారు చురుగ్గా ఉండటమే కాకుండా.. ఆరోగ్యంగా.. ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?