Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
- ప్రపంచంలో 5 కఠినమైన పరీక్షలు..
- వీటిలో పాస్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ..
- ఇండియా నుంచి యూపీఎస్సీ అండ్ ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఒక మంచి ఉద్యోగం సాధించాలని.. ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవడం కోసం లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడి రకరకాల పోటీ పరీక్షలు రాస్తుంటారు. అయితే.. ప్రపంచంలో కొన్ని పరీక్షలు మాత్రం అత్యంత కఠినమైనవిగా పేరుగాంచాయి. ఇవి కేవలం మీ తెలివితేటలనే కాకుండా.. మీ సహనాన్ని, మానసిక ధైర్యాన్ని కూడా పరీక్షిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఆ పరీక్షలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలోని టాప్-5 కఠినమైన పరీక్షలు..
Also Read
- Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
- Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
- Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
- Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
1. గావోకావో (చైనా):
చైనాలో నిర్వహించే ఈ పరీక్షను ప్రపంచంలోనే అత్యంత కష్టమైనదిగా భావిస్తారు. ఇది అక్కడి విద్యార్థులకు కాలేజీ ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష. సుమారు రెండు రోజుల పాటు జరిగే ఈ పరీక్ష కోసం విద్యార్థులు పగలు రేయి తేడా లేకుండా శ్రమిస్తారు. దీనిలో వచ్చే మార్కులే వారు ఏ యూనివర్సిటీలో చదవాలో నిర్ణయిస్తాయి.
2. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ (భారతదేశం):
మన దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ఇంజనీరింగ్ సీటు సాధించడం కోసం ఈ పరీక్ష రాస్తారు. లక్షలాది మంది పోటీ పడే ఈ పరీక్షలో ప్రశ్నలు చాలా లోతుగా, క్లిష్టంగా ఉంటాయి. దీని కోసం విద్యార్థులు చిన్నతనం నుంచే కోచింగ్ తీసుకుంటూ సిద్ధమవుతారు.
Also Read:Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చి హైకోర్టు..
3. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (భారతదేశం):
ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్ష మన దేశంలోనే అత్యంత కఠినమైనది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉంటుంది. కేవలం జ్ఞాపకశక్తి ఉంటే సరిపోదు.. లోకజ్ఞానం, విశ్లేషణాత్మక ఆలోచన చాలా ముఖ్యం.
4. మెన్సా ఐక్యూ టెస్ట్..
ఇది ఒక వ్యక్తి తెలివితేటలను (IQ) కొలిచే పరీక్ష. ప్రపంచ జనాభాలో కేవలం అత్యంత తెలివైన 2 శాతం మంది మాత్రమే దీనిలో అర్హత సాధించగలరు. దీనిలో అడిగే లాజికల్ ప్రశ్నలు మేధావులను సైతం తలగోక్కునేలా చేస్తాయి.
Also Read:Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..
5. సీఎఫ్ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్):
ఆర్థిక రంగం (Finance) లో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది. దీనిలో మూడు స్థాయిలు ఉంటాయి. పెట్టుబడులు, మార్కెట్ విశ్లేషణ వంటి విషయాలపై పూర్తి పట్టు ఉంటే తప్ప దీనిని పాస్ అవ్వడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో గుర్తింపు ఉంది.
తాజావార్తలు
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!