Health Tips: మధుమేహం (డయాబెటిస్) బారిన పడిన వారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న.. “అన్నం తినాలా? లేక చపాతీ తీసుకోవాలా?” అని. చాలా మంది అన్నం మానేసి చపాతీ తింటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుందని గట్టిగా నమ్ముతుంటారు. మరి వైద్యులు ఏమంటున్నారు? అసలు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏది తింటే వారి ఆరోగ్యం బాగుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Hyderabad News: హైదరాబాద్ ఊపిరి ఆగుతోంది.. బాం*బు పేల్చిన IIT కాన్పూర్ అధ్యయనం!
ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఎంత ఉన్నాయి అనేదే కీలకం అని వివరించారు. ఒక కప్పు అన్నంలో దాదాపు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అదే ఒక్క చపాతీలో కేవలం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. పైగా చపాతీలో పీచు పదార్థం (ఫైబర్) అన్నంతో పోలిస్తే ఒక 2 గ్రాములు ఎక్కువగా ఉంటుందని వివరించారు. నిజానికి చాలా మంది అన్నం తింటే షుగర్ పెరుగుతుందని భయపడతారు. కానీ ఇక్కడ పదార్థం కంటే ‘క్వాంటిటీ’ (పరిమాణం) ముఖ్యమని చెబుతున్నారు. ఒక కప్పు అన్నానికి బదులుగా రెండు చపాతీలు తీసుకుంటే శరీరానికి సమానమైన శక్తి అందుతుందని వెల్లడించారు.
సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లలో ఒక అలవాటు ఉంటుంది. అన్నం తినేటప్పుడు ప్లేటులో ఎంత వేసుకుంటున్నామో అన్న దానిపై స్పష్టమైన నియంత్రణ ఉండదు. కానీ చపాతీ విషయానికి వస్తే, రెండు చపాతీలు తిన్న తర్వాత ఆపేయడం సాధ్యమవుతుంది. రాత్రి వేళల్లో (Dinner) మితంగా తినడం ముఖ్యం కాబట్టి, రెండు చపాతీలతో భోజనం ముగించడం డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏది తిన్నా మితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు అన్నం ప్రియులైతే మీరు తినే అన్నం పరిమాణాన్ని ఒక కప్పుకు పరిమితం చేయాలని, క్రమశిక్షణతో కూడిన భోజనమే మధుమేహానికి అసలైన విరుగుడని వెల్లడించారు.
READ ALSO: Raghunath Reddy: టాలీవుడ్లో విషాదం.. కొడుకు చనిపోయిన నెల రోజులకే తెలుగు నటుడు మృతి
