Beauty Tips : జామ పండుతో.. అందమైన చర్మం మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చర్మం కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి నివారిస్తాయి. జామపండులోని యాంటీఆక్సిడెంట్లు.. ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..
ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్ప్యాక్లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్ ముక్కలు, ఒక జామ పండు తీసుకొని రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కావల్సిస్తే.. నీళ్లు యాడ్ చేయండి. ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి… మృదువైన మెరిసే చర్మం ను పొందవచ్చు..
Also Read
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
జామకాయ చర్మ ఛాయను మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. పండిన జామను మెత్తని గుజ్జుగా చేసి, గుడ్డు పచ్చసొనను యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్గా వేసుకోండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది..
మెరిసే చర్మం కోసం ఒక జామ పండును తీసుకొని గింజలు తొలగించి పెట్టుకోవాలి. దీంతో పాటు మరో రెండు జామ ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పాలు కూడా చేర్చి మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పేస్ట్లో అర టీస్పూన్ పాల పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్త్లె చేసుకోవాలి.. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీళ్లతో కడిగితే సరిపోతుంది.. నిగనిగలాడే చర్మం మీ సొంతం..
జామపండును ఇక స్కర్బ్ లాగా కూడా వాడొచ్చు.. ఇందుకోసం ఒక జామ పండు, రెండు జామ ఆకులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఓట్మీల్ వేసి మెత్తని పేస్ట్లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఇలా పది నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి..ఇలా తరచూ చెయ్యడం వల్ల మొటిమలు, మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!