Beauty Tips : జామ పండుతో.. అందమైన చర్మం మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చర్మం కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి నివారిస్తాయి. జామపండులోని యాంటీఆక్సిడెంట్లు.. ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..
ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్ప్యాక్లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్ ముక్కలు, ఒక జామ పండు తీసుకొని రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కావల్సిస్తే.. నీళ్లు యాడ్ చేయండి. ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి… మృదువైన మెరిసే చర్మం ను పొందవచ్చు..
Also Read
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
- WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
జామకాయ చర్మ ఛాయను మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. పండిన జామను మెత్తని గుజ్జుగా చేసి, గుడ్డు పచ్చసొనను యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్గా వేసుకోండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది..
మెరిసే చర్మం కోసం ఒక జామ పండును తీసుకొని గింజలు తొలగించి పెట్టుకోవాలి. దీంతో పాటు మరో రెండు జామ ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పాలు కూడా చేర్చి మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పేస్ట్లో అర టీస్పూన్ పాల పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్త్లె చేసుకోవాలి.. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీళ్లతో కడిగితే సరిపోతుంది.. నిగనిగలాడే చర్మం మీ సొంతం..
జామపండును ఇక స్కర్బ్ లాగా కూడా వాడొచ్చు.. ఇందుకోసం ఒక జామ పండు, రెండు జామ ఆకులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఓట్మీల్ వేసి మెత్తని పేస్ట్లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఇలా పది నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి..ఇలా తరచూ చెయ్యడం వల్ల మొటిమలు, మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!