UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- డిగ్రీ పాసైన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్
- 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, IFS కోసం 150 ఖాళీలను కమిషన్ నోటిఫై చేసింది.
UPSC CSE ప్రిలిమినరీ పరీక్ష 2025 కోసం ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS) ఇతర సర్వీస్లలో అధికారులను ఎంపిక చేస్తారు. IAS కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read
- Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అదే సమయంలో, IFS కోసం, అభ్యర్థులు యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ లేదా తత్సమాన సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. వయస్సు 1 ఆగస్టు 2025 నాటికి లెక్కించబడుతుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందించబడింది. UPSC CSE పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరవుతారు. UPSC మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25, 2025న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు upsc.gov.in పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!