UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- డిగ్రీ పాసైన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్
- 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, IFS కోసం 150 ఖాళీలను కమిషన్ నోటిఫై చేసింది.
UPSC CSE ప్రిలిమినరీ పరీక్ష 2025 కోసం ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS) ఇతర సర్వీస్లలో అధికారులను ఎంపిక చేస్తారు. IAS కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
అదే సమయంలో, IFS కోసం, అభ్యర్థులు యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ లేదా తత్సమాన సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. వయస్సు 1 ఆగస్టు 2025 నాటికి లెక్కించబడుతుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందించబడింది. UPSC CSE పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరవుతారు. UPSC మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25, 2025న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు upsc.gov.in పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!