UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- డిగ్రీ పాసైన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్
- 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, IFS కోసం 150 ఖాళీలను కమిషన్ నోటిఫై చేసింది.
UPSC CSE ప్రిలిమినరీ పరీక్ష 2025 కోసం ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS) ఇతర సర్వీస్లలో అధికారులను ఎంపిక చేస్తారు. IAS కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read
- SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
- HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
- LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు
అదే సమయంలో, IFS కోసం, అభ్యర్థులు యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ లేదా తత్సమాన సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. వయస్సు 1 ఆగస్టు 2025 నాటికి లెక్కించబడుతుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందించబడింది. UPSC CSE పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరవుతారు. UPSC మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25, 2025న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు upsc.gov.in పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!