UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- డిగ్రీ పాసైన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్
- 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, IFS కోసం 150 ఖాళీలను కమిషన్ నోటిఫై చేసింది.
UPSC CSE ప్రిలిమినరీ పరీక్ష 2025 కోసం ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS) ఇతర సర్వీస్లలో అధికారులను ఎంపిక చేస్తారు. IAS కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
- Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
అదే సమయంలో, IFS కోసం, అభ్యర్థులు యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ లేదా తత్సమాన సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. వయస్సు 1 ఆగస్టు 2025 నాటికి లెక్కించబడుతుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందించబడింది. UPSC CSE పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరవుతారు. UPSC మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25, 2025న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు upsc.gov.in పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!