Indian Youth Opting Gig jobs: ‘గిగ్’ జాబ్స్ వైపు.. భారతీయ యువత చూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్ అనే ఫ్రీల్యాన్స్ జాబ్స్ ప్లాట్ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్కి డిమాండ్ నెలకొనటం వల్ల కూడా గిగ్ జాబ్స్ రిక్రూట్మెంట్లు పెరుగుతున్నాయి. అయితే మహిళలు ఈ ఆప్షన్ను పెద్దగా ఎంపిక చేసుకోవట్లేదని ఫ్లెక్సింగిట్ ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రిక తెలిపారు.
363 కొత్త బ్రాంచ్లు
Also Read
- India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
- Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
- Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 21 రాష్ట్రాల్లో దాదాపు 363 కొత్త శాఖలను ప్రారంభించాలని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన ‘ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ డ్రైవ్’ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 3 వేల కన్నా ఎక్కువ మంది జనాభా గల గ్రామాలకు 5 కిలో మీటర్ల లోపు దూరంలో కనీసం ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ సూచించే ప్రాంతాల్లో ఈ శాఖలను ఓపెన్ చేయనున్నారు.
Hidden Valleys in Himalayas Live: హిమాలయాల్లో రహస్య స్వర్గం
గల్ఫ్ దేశాల నుంచే
సమీప భవిష్యత్లో భారత్కు క్రూడాయిల్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాల నుంచే వస్తుందని పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఆయా దేశాల్లో సురక్షితమైన, సరసమైన ఇంధన వనరులు ఉన్నట్లు ఇండియా భావిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధం అనంతరం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదంటూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు చౌకగా లభిస్తుండటంతో భారతీయ రిఫైనర్లు అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి