NSPG Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.15 వేలు మీ అకౌంట్లోకే.. అస్సలు వదులుకోవద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NSPG Scholarship: కేంద్ర ప్రభుత్వం పీజీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ను ప్రారంభించింది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆలోచిస్తుంటే, ఫీజులు, బోర్డింగ్ లేదా పుస్తకాల కొనుగోలు గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్కాలర్షిప్ మీకు విశేషంగా ఉపయోగపడుతుంది. దీని కింద మీకు ప్రతి నెలా రూ.15 వేలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ స్కాలర్షిప్ డబ్బులు మీకు రెండు సంవత్సరాలు వస్తాయి. ఈ స్కాలర్షిప్ను నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనే పేరుతో పిలుస్తారు. దీని ఉద్దేశం.. ఆర్థిక పరిమితుల కారణంగా చదువును కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకు సహాయం చేయడం. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, తదితర వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్కు బెయిల్.. అయినా జైలులోనే..!
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
- SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
- RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
NSPG స్కాలర్షిప్ అంటే..
ఈ స్కాలర్షిప్ భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 10 వేల మంది పీజీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 10 నెలల పాటు నెలకు రూ.15 వేలు అందిస్తారు. అంటే సంవత్సరానికి సుమారు రూ.1.5 లక్షలు, రెండు సంవత్సరాలలో రూ.3 లక్షల వరకు అందుతుంది. ఈ డబ్బు నేరుగా విద్యార్థి ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలో ప్రతీ నెల జమ అవుతుంది.
* మొదటిసారి పీజీ కోర్సు చేస్తున్న విద్యార్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే పీజీ పూర్తి చేసి ఉంటే, దీనికి అప్లై చేయడానికి మీరు అర్హులు కారు.
* విద్యార్థి గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్, పూర్తి సమయం పీజీ కోర్సులో ప్రవేశం పొందాలి.
* ఓపెన్, డిస్టెన్స్, పార్ట్ టైమ్ లేదా ప్రైవేట్ మోడ్ ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తించదు.
* పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందే సమయానికి విద్యార్థి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
* UGC గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులు.
* ఈ స్కాలర్షిప్లో ప్రభుత్వం 30% సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది.
* ఈ స్కాలర్షిప్కు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఆసక్తిగల విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేద్దామని అనుకుంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. UGC వెబ్సైట్లో ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పోస్ట్ చేస్తారు. దరఖాస్తు చేసేటప్పుడు, విద్యార్థులు తమ వివరాలను జాగ్రత్తగా నింపాలి. పేరు, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా IFSC కోడ్లో చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే.. మీ అప్లికేషన్ తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీనికి అప్లై చేసే టైంలో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని పలువురు నిపుణులు సూచించారు.
READ ALSO: IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!
తాజావార్తలు
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
-
Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!