Cent Percent Work From Home: అక్కడ మళ్లీ వంద శాతం వర్క్ ఫ్రం హోం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ సమయంలో ఎస్ఈజెడ్ యూనిట్లలో సెంట్పర్సెంట్ వర్క్ ఫ్రం హోంకి అనుమతివ్వటాన్ని అందరూ మెచ్చుకున్నారని, సర్వీసుల ఎక్స్పోర్టులు సైతం వృద్ధిచెందాయని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయెల్ గుర్తుచేశారు.
మరింత మందికి మెడి‘కవర్’
Also Read
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
హైదరాబాద్కి చెందిన మెడికవర్ హాస్పిటల్స్ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆసుపత్రులను నిర్మించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన నెట్వర్క్ హాస్పిటల్స్లో 5 వేల మెడికల్ బెడ్లు ఉండగా ఆ సంఖ్యను వచ్చే ఏప్రిల్లోపు 6,500లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. మరో మూడేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వెళ్లే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
ఇండియాలోనే ఫస్ట్
మన దేశంలో తొలి సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటుకానుంది. ఇండియాలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అగర్వాల్.. తైవాన్కి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్తో కలిసి ఈ ప్లాంటను నిర్మించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. ఈ చిప్ పరిశ్రమను దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
మన దేశ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అవి ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 598 పాయింట్లకుపైగా కోల్పోయి 59972 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 298 పాయింట్లు తగ్గి 17771కి దిగొచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో ఆగస్టు నెల అంచనాలను మించిన ద్రవ్యోల్బణం పెరగటంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా అక్కడి మార్కెట్ల పైన, పరోక్షంగా ఇక్కడి మార్కెట్ల పైన పడింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!