Cent Percent Work From Home: అక్కడ మళ్లీ వంద శాతం వర్క్ ఫ్రం హోం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ సమయంలో ఎస్ఈజెడ్ యూనిట్లలో సెంట్పర్సెంట్ వర్క్ ఫ్రం హోంకి అనుమతివ్వటాన్ని అందరూ మెచ్చుకున్నారని, సర్వీసుల ఎక్స్పోర్టులు సైతం వృద్ధిచెందాయని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయెల్ గుర్తుచేశారు.
మరింత మందికి మెడి‘కవర్’
Also Read
- RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
హైదరాబాద్కి చెందిన మెడికవర్ హాస్పిటల్స్ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆసుపత్రులను నిర్మించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన నెట్వర్క్ హాస్పిటల్స్లో 5 వేల మెడికల్ బెడ్లు ఉండగా ఆ సంఖ్యను వచ్చే ఏప్రిల్లోపు 6,500లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. మరో మూడేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వెళ్లే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
ఇండియాలోనే ఫస్ట్
మన దేశంలో తొలి సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటుకానుంది. ఇండియాలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అగర్వాల్.. తైవాన్కి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్తో కలిసి ఈ ప్లాంటను నిర్మించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. ఈ చిప్ పరిశ్రమను దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
మన దేశ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అవి ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 598 పాయింట్లకుపైగా కోల్పోయి 59972 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 298 పాయింట్లు తగ్గి 17771కి దిగొచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో ఆగస్టు నెల అంచనాలను మించిన ద్రవ్యోల్బణం పెరగటంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా అక్కడి మార్కెట్ల పైన, పరోక్షంగా ఇక్కడి మార్కెట్ల పైన పడింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!