Coal India MT Recruitment 2025: కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్.. మిస్ చేసుకోకండి
- కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 14
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ క్రేజ్ ఉంటుది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అందుకే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. లక్షలాది మంది పోటీ పడుతుంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 434 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీకానున్న పోస్టు్ల్లో కమ్యూనిటీ డెవలప్ మెంట్ 20, పర్యావరణం 28, ఫైనాన్స్ 103, లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మెటీరియల్ మేనేజ్ మెంట్ 44, పర్సనల్ అండ్ హెచ్ ఆర్ 97, సెక్యూరిటీ 31, కోల్ ప్రిపరేషన్ 68 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్, BE, B.Tech, B.Sc (ఇంజనీరింగ్), మాస్టర్స్ డిగ్రీ, PG, డిప్లొమా, CA లేదా ICWA వంటి సంబంధిత రంగాలలో డిగ్రీని పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
Also Read
- SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
- HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
- LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు
ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్ ద్వారా అభ్యర్థలను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఈ2 గ్రేడ్ వారికి రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షల జీతం ఉంటుంది. ఈ3 గ్రేడ్ వారికి రూ. 60 వేల నుంచి రూ. 1.8 లక్షల వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ / ఓబీసీ (క్రీమీలేయర్ అండ్ నాన్ క్రీమీలేయర్) / ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000/- +జీఎస్టీ – రూ.180/- మొత్తం రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!