Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- అమెరికాలో పర్యటిస్తున్న కింగ్ చార్లెస్ దంపతులు
- కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి
- కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. కింగ్ చార్లెస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నం దగ్గర జరిగిన పుష్పగుచ్ఛ సమర్పణ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. తనకు కింగ్ చార్లెస్ను కలిసే అవకాశం వస్తే.. కోహినూర్ వజ్రం భారత్కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని పేర్కొన్నారు. ఈ విషయం అధికారిక చర్చల్లో లేకపోయినా.. రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు.

Also Read
- Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
ఇక స్మారక కార్యక్రమంలో కింగ్ చార్లెస్ను మమ్దానీ పలకరించారు. ఆ సమయంలో కోహినూర్ వజ్రం అంశం ప్రస్తావనకు వచ్చిందో.. రాలేదో మాత్రం స్పష్టత రాలేదు. ఈ విషయంపై బకింగ్హామ్ ప్యాలెస్ కూడా ఇంకా స్పందించలేదు.
కోహినూర్ వజ్రం భారత్కు చెందిన అమూల్యమైన వజ్రం. ఇది బ్రిటిస్ పాలనలో వారి చేతికి చిక్కింది. ప్రస్తుతం బ్రిటిష్ క్రౌన్ జువెల్స్లో ఉంది. అయితే ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని భారత్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ బ్రిటన్ మాత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా న్యూయార్క్ మేయర్ ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.
చరిత్ర ఇదే.
105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం భారతదేశంలో పుట్టింది. ఇది మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజులు, ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి మారుతూ వచ్చింది. చివరగా 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది లండన్లోని క్రౌన్ జువెల్స్ ప్రదర్శనలో ఉంది.
భారత్ వాదన
వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకుందని భారత్ ఆరోపించింది. ఇది దేశ చరిత్రకు చెందిన అమూల్య వారసత్వమని.. తిరిగి ఇవ్వాలని భారత్ నిరంతరం కోరుతోంది. అయితే బ్రిటన్ మాత్రం అప్పటి ఒప్పందం ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కు ఉందని చెబుతోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్లో ఏమైనా జరగొచ్చు.
#WATCH | "If I were to speak to the King separately from that, I would probably encourage him to return the Kohinoor diamond," says New York Mayor Zohran Mamdani on meeting King Charles III during the wreath-laying ceremony at the 9/11 memorial in New York.
(Source: Mayor Zohran… pic.twitter.com/EExmI1ypqA
— ANI (@ANI) April 29, 2026
తాజావార్తలు
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?