Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- అమెరికాలో పర్యటిస్తున్న కింగ్ చార్లెస్ దంపతులు
- కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి
- కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. కింగ్ చార్లెస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నం దగ్గర జరిగిన పుష్పగుచ్ఛ సమర్పణ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. తనకు కింగ్ చార్లెస్ను కలిసే అవకాశం వస్తే.. కోహినూర్ వజ్రం భారత్కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని పేర్కొన్నారు. ఈ విషయం అధికారిక చర్చల్లో లేకపోయినా.. రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు.

Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
ఇక స్మారక కార్యక్రమంలో కింగ్ చార్లెస్ను మమ్దానీ పలకరించారు. ఆ సమయంలో కోహినూర్ వజ్రం అంశం ప్రస్తావనకు వచ్చిందో.. రాలేదో మాత్రం స్పష్టత రాలేదు. ఈ విషయంపై బకింగ్హామ్ ప్యాలెస్ కూడా ఇంకా స్పందించలేదు.
కోహినూర్ వజ్రం భారత్కు చెందిన అమూల్యమైన వజ్రం. ఇది బ్రిటిస్ పాలనలో వారి చేతికి చిక్కింది. ప్రస్తుతం బ్రిటిష్ క్రౌన్ జువెల్స్లో ఉంది. అయితే ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని భారత్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ బ్రిటన్ మాత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా న్యూయార్క్ మేయర్ ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.
చరిత్ర ఇదే.
105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం భారతదేశంలో పుట్టింది. ఇది మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజులు, ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి మారుతూ వచ్చింది. చివరగా 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది లండన్లోని క్రౌన్ జువెల్స్ ప్రదర్శనలో ఉంది.
భారత్ వాదన
వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకుందని భారత్ ఆరోపించింది. ఇది దేశ చరిత్రకు చెందిన అమూల్య వారసత్వమని.. తిరిగి ఇవ్వాలని భారత్ నిరంతరం కోరుతోంది. అయితే బ్రిటన్ మాత్రం అప్పటి ఒప్పందం ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కు ఉందని చెబుతోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్లో ఏమైనా జరగొచ్చు.
#WATCH | "If I were to speak to the King separately from that, I would probably encourage him to return the Kohinoor diamond," says New York Mayor Zohran Mamdani on meeting King Charles III during the wreath-laying ceremony at the 9/11 memorial in New York.
(Source: Mayor Zohran… pic.twitter.com/EExmI1ypqA
— ANI (@ANI) April 29, 2026
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?