Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- అమెరికాలో పర్యటిస్తున్న కింగ్ చార్లెస్ దంపతులు
- కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి
- కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. కింగ్ చార్లెస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నం దగ్గర జరిగిన పుష్పగుచ్ఛ సమర్పణ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. తనకు కింగ్ చార్లెస్ను కలిసే అవకాశం వస్తే.. కోహినూర్ వజ్రం భారత్కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని పేర్కొన్నారు. ఈ విషయం అధికారిక చర్చల్లో లేకపోయినా.. రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు.

Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
ఇక స్మారక కార్యక్రమంలో కింగ్ చార్లెస్ను మమ్దానీ పలకరించారు. ఆ సమయంలో కోహినూర్ వజ్రం అంశం ప్రస్తావనకు వచ్చిందో.. రాలేదో మాత్రం స్పష్టత రాలేదు. ఈ విషయంపై బకింగ్హామ్ ప్యాలెస్ కూడా ఇంకా స్పందించలేదు.
కోహినూర్ వజ్రం భారత్కు చెందిన అమూల్యమైన వజ్రం. ఇది బ్రిటిస్ పాలనలో వారి చేతికి చిక్కింది. ప్రస్తుతం బ్రిటిష్ క్రౌన్ జువెల్స్లో ఉంది. అయితే ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని భారత్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ బ్రిటన్ మాత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా న్యూయార్క్ మేయర్ ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.
చరిత్ర ఇదే.
105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం భారతదేశంలో పుట్టింది. ఇది మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజులు, ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి మారుతూ వచ్చింది. చివరగా 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది లండన్లోని క్రౌన్ జువెల్స్ ప్రదర్శనలో ఉంది.
భారత్ వాదన
వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకుందని భారత్ ఆరోపించింది. ఇది దేశ చరిత్రకు చెందిన అమూల్య వారసత్వమని.. తిరిగి ఇవ్వాలని భారత్ నిరంతరం కోరుతోంది. అయితే బ్రిటన్ మాత్రం అప్పటి ఒప్పందం ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కు ఉందని చెబుతోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్లో ఏమైనా జరగొచ్చు.
#WATCH | "If I were to speak to the King separately from that, I would probably encourage him to return the Kohinoor diamond," says New York Mayor Zohran Mamdani on meeting King Charles III during the wreath-laying ceremony at the 9/11 memorial in New York.
(Source: Mayor Zohran… pic.twitter.com/EExmI1ypqA
— ANI (@ANI) April 29, 2026
తాజావార్తలు
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ