Study For Jobs: ఉద్యోగాలొచ్చే చదువే కావాలి… సర్వేలో యువత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Study For Jobs: చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని భావిస్తారు. కాన ఇప్పుడున్న యువత ఉద్యోగాలొచ్చే చదువే కావాలని కోరుకుంటోంది. అంటే చదువు అంటే తనకు జ్ఞానం కావాలి.. తరువాత ఉద్యోగం కావాలని భావించే రోజులు పోయాయని.. ఇప్పుడు కేవలం ఉద్యోగాలొచ్చే చదువే కావాలని యువత కోరుకుంటోందని ఒక సర్వేలో వెల్లడయింది. భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించే విధంగా ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులు కావాలని నేటి యువత కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. యూఎన్ గ్లోబల్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుమారు 40.5 శాతం మంది యువత ఉద్యోగాలొచ్చే చదువులే కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
Read also: Join My Wedding: పెళ్లి చేసుకోండి.. కోట్లు సంపాదించండి
Also Read
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
స్వతంత్ర జీవనానికి, ఆర్థిక, సామాజిక భద్రతకు భరోసానిచ్చేలా చదువు ఉండాలన్నది తమ అభిలాషగా 10 నుంచి 24 ఏళ్ల వయసున్న గ్రూపులోని 40.5శాతం మంది తెలిపారు. ‘యువత ఏం కోరుకుంటోంది’ అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుబంధ సంస్థ అయిన పీఎంఎన్సీహెచ్ ప్రపంచవ్యాప్త రియల్టైమ్ సర్వేను నిర్వహించింది. 10 నుంచి 24 ఏళ్ల వయసున్న 7,13,273 మందితో లిఖితపూర్వకంగా సర్వే నిర్వహించింది. వారిలో మన దేశానికి చెందిన వారు 17.2శాతంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 12న జరుపుకునే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే నిర్వాహకులు శుక్రవారం మధ్యంతర నివేదిక విడుదల చేశారు. సర్వేలో 15-19 వయసు గ్రూపు వారు 47.2 శాతం మంది ఉన్నారు. వారిలోనూ కిశోరప్రాయ బాలికలు 49.2 శాతం మంది ఉన్నారు. వారు ప్రస్తావిస్తున్న అంశం ఏమిటంటే..చదువుతోనే అవకాశాలుండాలని, నాణ్యమైన విద్య లభించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాగే చదువుతో భద్రత… భరోసానిచ్చే వాతావరణం ఉండాలని 21.2శాతం మంది చెప్పారు. మంచి ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు 16.3శాతం మంది తెలిపారు. కిశోరప్రాయ బాలురు… విద్యకు వెళుతున్న సమయంలో పరిశుద్ధమైన నీరు, మంచి రహదారులు ఉండాలని సూచించగా.. అదే వయసు బాలికలు పరిశుద్ధమైన నీరు అందుబాటులో ఉండాలని తెలపడంతో పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలన్నారు.నేటి యువత ఏమీ కోరుకుంటుందేమిటో తెలుసుకుని దేశాల వారీగా వాటిని సాకారం చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు.. అదేవిధంగా విధాన నిర్ణేతలను ఒప్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని పీఎంఎన్సీహెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెల్గా ఫాగ్స్టాడ్ సర్వే గురించి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..