Work From Home: వర్క్ ఫ్రం హోమ్ ఇక చట్టబద్ధం.. ప్రపంచంలోనే తొలి దేశమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.
Read Also: Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇదిలా ఉంటే ఏకంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లును నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇటీవల ఆ దేశ చట్ట సభల్లోని దిగువసభలో ప్రవేశపెట్టింది. దీన్ని సభ ఆమోదించింది. ఎగువసభ కూడా ఆమోదిస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ద్వారా ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని వర్క్ ఫ్రం హోం కోసం డిమాండ్ చేయవచ్చు. వర్క్ ఫ్రం హోంను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా ప్రపంచంలో నెదర్లాండ్స్ నిలవనుంది. మరోవైపు మరికొన్ని దేశాలు కూడా వర్క్ ఫ్రం హోం చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్కాట్కాండ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు వర్క్ ఫ్రం హోం చేసుకునే ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే అందుకు బదులుగా జీతాల్లో కోత విధిస్తామని చెప్పింది. దీంతో ఈ అంశం అక్కడ వివాదాస్పదం అయింది.
అయితే కరోనా తగ్గముఖం పట్టడంతో చాలా దేశాల్లో ఉద్యోగులను కంపెనీలు ఆఫీసులకు రమ్మని చెబుతున్నాయి. ఆఫీసులకు వస్తేనే పని మరింగా మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించారు.. అలా చేయకపోతే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!