Titan: సముద్రంలో పేలిపోయిన “టైటాన్”.. విధ్వంసానికి కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శిథిలాలు చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ఆచూకీ లభించింది. టైటానికి సమీపంలోనే దీని శిథిలాలను కనుగొన్నారు. అయితే టైటాన్ మిస్సైన కొద్ది సేపటికే అది పేలిపోయినట్లు యూఎస్ నేవీ గుర్తించింది. అండర్వాటర్ సౌండ్ మానిటరింగ్ పరికరాల ద్వారా టైటాన్ సబ్మెర్సిబుల్ పేలినట్లు యుఎస్ నేవీ గుర్తించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది. మ్యూనికేషన్లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్మెర్సిబుల్ పనిచేస్తున్న సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించింది అని అధికారి జర్నల్తో చెప్పారు. దాదాపుగా నాలుగు రోజుల వెతుకులాట తర్వాత సముద్రగర్భంలో 3800 మీటర్లు లోతులో టైటాన్ అవశేషాలను యూఎస్ కోస్ట్ గార్డ్ కనుగొంది. టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
టైటానిక్ శిథిలాలు దాదాపుగా సముద్ర ఉపరితలం నుంచి 4 కిలోమీటర్ల లోతులో ఉన్నాయి. వీటిని చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషన్ గేట్ ఇంక్ అనే కంపెనీ టైటాన్ అనే ఒక సబ్ మెర్సిబుల్ సహాయంతో ఇంతకుముందు అనేక సార్లు సముద్రంలోకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూపించింది. ఈ సారి మాత్రం ‘కాటస్ట్రిఫిక్ ఇంప్లోజన్’ కారణంగా టైటాన్ పేలిపోయింది. సముద్ర అడుగు భాగంలో విపరీతమైన పీడనాన్ని తట్టుకునే విధంగా టైటాన్ రూపొందించబడింది. అయితే ఈ సారి మాత్రం ఆ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. టైటాన్ ఉన్న ప్రాంతంలో సాధారణ వాతావరణ పీడనంలో పోలిస్తే 400 రెట్లు పీడనం ఉంటుంది. సముద్రం మట్టం వద్ద వాతావరణ పీడనం చదరపు అంగుళానికి 14.7 పౌండ్లు (psi) ఉంటుంది. నీటిలో లోపట 6000 psi ఉంటుంది.
అంతటి శక్తిని టైటాన్ తట్టుకోలేక పేలిపోయినట్లు తెలుస్తోంది. అపారమైన నీటి పీడనం వల్ల సబ్ మెరైన్ మల్లి సెకన్లలో కుప్పకూలింది. నిజానికి టైటాన్ అంతటి పీడనాన్ని తట్టుకునేలా తయారు చేయబడింది. అయితే అందులో భద్రతాపరమైన సమస్యలు తలెత్తి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రెషర్ హాల్ వైఫల్యం’ వల్ల పేలుడు సంభవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని ‘నీట్’లో ర్యాంక్..
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!