Earth: భూమి ఒక్క సెకన్ తిరగడం ఆగితే, ఏం జరుగుతుంది..?
- భూమి ఒక్క సెకన్ తిరగడం ఆగితే ఏం జరుగుతుంది..?
- విధ్వంసమే అంటున్న శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth: మన విశ్వంలో ఇప్పటి వరకు జీవజాలానికి అనువైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. భూమి లాంటి జీవనానికి అనుకూలంగా ఉన్న గ్రహాలను కనుగొనేందుకు ఈ అనంత కోటి విశ్వంలో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. భూమికి ఉన్న ఫీచర్లు లాంటివి ఏ గ్రహానికి లేవు. తన మాతృ నక్షత్రం అయిన సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా, మరీ దగ్గరగా కాకుండా జంతు, వృక్షాలకు అనువైన ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో ఉంది. దీనికి తోడు చంద్రుడి లాంటి ఉపగ్రహం కూడా భూమికి ఉండటం ప్లస్ పాయింట్.
ఇక భూమి 23.5 డిగ్రీలు వంగి తన అక్షం చుట్టూ తాను తిరిగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికి తెలుసు. భూమి ప్రతీ గంటలకు దాదాపుగా 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇంత స్పీడ్లో తిరుగుతున్న భూమి ఒక్క సెకను పాటు ఆగితే ఏం అవుతుందో ఊహించుకోండి. ఒక్క సెకనే కదా ఏం అవుతుందని అనుకుంటే పొరపాటే. ఈ ఒక్క సెకన్ లో ప్రళయమే ముంచుకు వస్తుంది.
Also Read
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
- Kuwait-Iran: కువైట్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
Read Also: Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం ఏంటి.? రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఎందుకు.?
ప్రతీ 23 గంటల 56 నిమిషాలకు భూమి తన చుట్టూ తాను ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ స్థిరమైన కదలికలు పగలు-రాత్రులకు సహాయపడుతున్నాయి. వాతావరణ, మహాసముద్రాల ప్రవర్తనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక వేళ ఒక్క సెకన్ పాటు భూమి తిరగడం ఆపేస్తే, భూమిపై ఉన్న ప్రతీ ఒక్కటి వినాశకరమైన వేగంతో తూర్పు వైపు విసిరేయబడుతారు. వాతావరణ కదలికల్లో ఉండీ, వెయ్యి తుఫానుల శక్తితో భూమిపై ఉన్న ప్రకృతిని తుడిచిపెడుతుంది. నిర్మాణాలు కూలిపోతాయి, చెట్లు వేర్లతో సహా విసిరేయబడుతాయి.
ఆకస్మికంగా భూమి ఆగడం వల్ల, భూ అంతర్భాగంలోని పొరలు మారడం వల్ల, భారీ భూకంపాలు సంభవిస్తాయి. మహాసముద్రాలు ఉప్పొంగి, సునామీలు విధ్వంసం సృష్టిస్తాయి. ఈ పరిణామం భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరిని చంపేస్తుంది, మనం ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా ఆగితే ఎలా మనం ముందుకు పడుతామో, 1600 వేగంతో ప్రయాణిస్తున్న భూమి ఆగితే ప్రతీ ఒక్కరు కూడా తీవ్రమైన వేగంతో తోసేయబడుతారని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డిగ్రాస్సే టైసన్ చెప్పారు.
ఇదే కాకుండా, ఈ పరిణామం చంద్రుడి లయను కూడా దెబ్బతీస్తుంది. భూమి భ్రమణం దాని గురుత్వాకర్షణ శక్తితో ముడిపడి ఉంది. ఇది చంద్రుడిని ప్రభావితం చేస్తుంది. ఇది చంద్రుడి మార్గాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. అయితే, భూమి భ్రమణం ఆగిపోకయే అవకాశం లేనప్పటికీ, అలాంటి సంఘటన పరిణామాలు మాత్రం విధ్వంసంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!