Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sir Creek Dispute Explained India Pakistan Maritime Clash Back In Focus After Rajnath Singhs Warning

Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం ఏంటి.? రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఎందుకు.?

Published Date :October 2, 2025 , 6:52 pm
By Venu Goapl Reddy
  • భారత్-పాక్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం..
  • పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్..
  • అసలేంటి ఈ వివాదం, ఎందుకంత కీలకం..
Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం ఏంటి.? రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఎందుకు.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య కొత్తగా ‘‘సర్ క్రీక్ ’’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచడంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఈ సమస్యను భారత్ చర్చల ద్వారా చాలా సార్లు పరిష్కరించేందుకు ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం వేరేగా ఉన్నాయని రాజ్ నాథ్ అన్నారు.

అసలు ఏంటీ సర్ క్రీక్, ఎక్కడ ఉంది..?

Also Read

  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
  • Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
  • Delhi: లక్ష్మీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం

భారత్ గుజరాత్ రాష్ట్రం, పాకిస్తాన్ సింధ్ రాష్ట్రాల మధ్య ఉన్న ఉప్పునీటి చిత్తడి ప్రాంతాన్ని సర్ క్రీక్‌గా పిలుస్తారు. ఈ ప్రాంతంలోకి అరేబియా సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది.

రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన వివాదాల్లో ఇది ఒకటి. నిర్జన చిత్తడి ప్రాంతం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ నిల్వలు, అరేబియా సముద్రంలో సముద్ర సరిహద్దులు, స్పెషల్ ఎకనామిక్ జోన్‌లను ప్రభావితం చేస్తుంది. 96 కి.మీ నదీముఖ ద్వారం, ఈ క్రీక్ అరేబియా సముద్రంలోకి చొచ్చుకువెళ్తుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సరిహద్దులు 1968 ట్రిబ్యునల్ అవార్డ్ స్పష్టంగా నిర్వచించింది.

వివాదం ఏంటి..?

1947 స్వాతంత్ర్యం తర్వాత సింధ్ పాకిస్తాన్‌లో భాగం కాగా, గుజరాత్ భారత్‌లో ఉంది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ ‘‘రాన్ ఆఫ్ కచ్’’ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్ క్రీక్ అనేక రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదు. భారత్ ముందుగా సముద్ర సరిహద్దును గుర్తించాలని కోరుకుంటే, పాక్ మాత్రం సర్ క్రీక్ వివాదాన్ని ముందుగా పరిష్కరించాలని పట్టుబడుతోంది.

పాకిస్తాన్ మొత్తం సర్ క్రీక్ సింధ్ ప్రాంతానికి చెందినదే అని వాదిస్తోంది. ఇది 1914 తీర్మానం సరిహద్దును తూర్పు ఒడ్డున ఉంచింది. అంటే దీని ప్రకారం, మొత్తం ఈ చిత్తడి నేలలు తమకే చెందుతుందని పాక్ వాదన. అయితే, భారత్ మాత్రం 1914 బ్రిటీష్ అధికారులు ఈ ఒప్పందంలో ‘‘థాల్వెగ్ సూత్రాన్ని’’ వర్తింప చేసిందని ప్రస్తావిస్తోంది. దీని అర్థం క్రీక్‌లోని కాలువ మార్గంలో లోతైన ప్రాంతం నుంచి సరిహద్దును గీయాల్సి ఉంటుందని చెబుతోంది. అయితే, ఈ సూత్రాన్ని వర్తింపచేయడానికి ఇక్కడ నది లేదని పాకిస్తాన్ వాదిస్తోది. 1925 బ్రిటీష్ మ్యాప్‌ లో సరిహద్దు రాళ్లు నీటి మధ్యలో ఉన్నాయి. ఇది భారత్ వాదనని సమర్థి్స్తోంది.

ఆర్థికంగా చాలా ప్రాముఖ్యం:

సర్ క్రీక్ ఇరు దేశాలకు వ్యూహాత్మక సైనిక విలువను కలిగి ఉంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ ఉన్నాయని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంపై నియంత్రణ సముద్ర సరిహద్దులు, ప్రత్యేక ఆర్థిక మండలాల (EEZలు)కు కీలకం. ఈ వివాదం తరుచుగా స్థానిక మత్స్యకారుల్ని ప్రభావితం చేస్తోంది. వారు తమకు తెలియకుండా దేశాల సరిహద్దుల్ని దాటుతున్నారు. దీంతో నెలల పాటు జైళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక ఎందుకు..?

గుజరాత్‌ భుజ్‌లో దసరా పండగ సందర్భంగా ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సర్ క్రీక్ విషయంలో పాకిస్తాన్ దుర్మార్గపు ఉద్దేశాన్ని కలిగి ఉందని ఆరోపించారు. సర్ క్రీక్‌కు అనుకుని ఉన్న ప్రదేశాల్లో పాకిస్తాన్ సైనిక సదుపాయాలను విస్తరిస్తోంది. కొత్త బెటాలియన్లు, తీర ప్రాంత రక్షణ పడవలు, మెరైన్ అసాల్ట్ క్రాఫ్ట్‌లను మోహరించింది. రాడార్లు, క్షిపణులు, నిఘా విమానాలతో వైమానిక రక్షణను బలోపేతం చేసింది.

ఈ నేపథ్యంలోనే రాజ్‌నాథ్ హెచ్చరిక వచ్చింది. 1965 యుద్ధంలో భారత్ సైన్యం లాహోర్‌ని చేరుకుందని, 2025లో పాకిస్తానీలు దుశ్చర్యకు పాల్పడితే, కరాచీకి వెళ్లే ఒక మార్గం ఈ క్రీక్ గుండా వెళ్తుందని గుర్తుంచుకోవాలని అని హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Exclusive Economic Zone
  • Gujarat Sindh border
  • India Pakistan border conflict
  • India-Pakistan
  • maritime boundary dispute

తాజావార్తలు

  • Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..

  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన

  • RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..

  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

  • Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions