Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
- క్రిస్మస్ రోజు ఉక్రెయిన్లోని పలు విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు..
- మాస్కో నుంచి కీవ్ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం..
- ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడించిన జో బైడెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: క్రిస్మస్ పండగ వేళ ఉక్రెయిన్లోని పలు విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఈ క్రమంలోనే మాస్కో దాడుల నుంచి కీవ్ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యాడు. దీనిపై ఇప్పటికే రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు పంపినట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్ గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి అక్కడి ప్రజలకు విద్యుత్ సరఫరా అందకుండా రష్యా కుట్ర చేస్తుందన్నాడు. మరికొన్ని రోజుల్లో బైడెన్ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోనున్నాడు.. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి ఉక్రెయిన్ కి మరింత ఎక్కువ సాయం చేయాలనే ఉద్దేశంతో బైడెన్ ప్రభుత్వం వరుస నిర్ణయాలను తీసుకుంటుంది.
Read Also: Khalistani Terrorist: ప్రయాగ్రాజ్లో జరగబోయే కుంభమేళాలో మోడీ, యోగినే మా టార్గెట్..
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
కాగా, ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించగా.. దానికి అదనంగా మరో 988 మిలియన్ డాలర్ల ఆయుధ సామగ్రిని అందజేస్తామని మాట ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆయుధాలు, ఇతర సహాయం అందిజేశారు. అయితే, గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. దీనికి తోడు నార్త్ కొరియా దళాలు మాస్కోకు తోడుగా ఉంటున్నాయి. ఇక, కీవ్ తనను రక్షించుకునేందుకు జో బైడెన్ కార్యవర్గం పెద్ద మొత్తంలో ఆయుధాలను సరఫరా చేస్తోంది. కాగా, క్రిస్మస్ పండగ రోజున ఉక్రెయిన్లోని పలు విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చేశాయి. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. అందులో 50 క్షిపణులను, పలు డ్రోన్లను తమ సేనలు పడగొట్టినట్లు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!