పంజ్ షేర్ లో ఏం జరుగుతోంది? ఏంటి పరిస్థితి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడుతోంది. తమ మాతృభూమిని తాలిబన్లకు దక్కనిచ్చేది లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. నార్తర్న్ అలయెన్స్ పేరిట ఏర్పడిన గ్రూప్ ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కాకుండా పోరాడుతోంది. అయితే దీనికి విరుద్దంగా తాలిబన్లు మాత్రం తాము పంజ్ షేర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
తాజాగా రష్యాకు చెందిన ప్రముఖ మీడియా స్పుత్నిక్ పంజ్ షీర్ లోని పరిస్థితులను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అప్ఘనిస్తాన్ ద్వారా తెలుసుకుంది. వారందించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు షంజ్ షేర్ లో 600మంది తాలిబన్లు మృతిచెందారు. మరో వెయ్యి మంది రెసిస్టెంట్స్ దళాల ఆధీనంలో బంధీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్తర్న్ అలయెన్స్ సైన్యాన్ని ఎదుర్కోలేక తాలిబన్లు వాళ్లంతట వాళ్లే లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నార్తర్న్ అలయెన్స్ పేరిట ఉన్న ట్వీటర్లోలోనూ ఈ విషయాలు ఉన్నాయి. దీంతో షంజ్ షేర్ తాలిబన్ల వశం అయిందన్న వార్తల్లో నిజం లేదని అర్థమవుతోంది.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
మరోవైపు తాలిబన్లకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ సహకారం అందిస్తోందని అమ్రుల్లా సాలేహ్ ఆరోపిస్తున్నారు. తాలిబన్ బద్రి 313 పేరిట 570మంది పాకిస్థాన్ ప్రత్యేక దళాలు, అల్ ఖైదా, ఐసీస్ ఉగ్రవాదులు నార్తర్న్ అలయెన్స్ సైన్యంపై దాడికి దిగుతున్నాయని తెలిపారు. వీరిని పాకిస్థాన్ ఐఎస్ఐ హెడ్ ఆపరేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే పాకిస్థాన్ మాత్రం అమ్రుల్లా వ్యాఖ్యల్లో నిజం లేదని కొట్టిపారేస్తుంది. ప్రస్తుతం తాలిబన్లకు పంజ్ షేర్ సైన్యానికి మధ్య పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు తాలిబన్లు అప్ఘన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేలోగా వారిని అంతమొందించాలని నార్తర్న్ అలియన్స్ భావిస్తోంది. అక్టోబర్ నాటికి తాలిబన్లు పంజ్ షేర్ లోకి అడుగుపెట్టనీయకుండా చేస్తే ఈ ప్రాంత ముట్టడి వారికి మరింత కష్టంగా మారుతుందని భావిస్తున్నారు.
చలికాలంలో తాలిబన్లు ఈప్రాంతంలో పోరాటం చేయడం కష్టసాధ్యంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో తమకు ఐదునెలల సమయం దొరుకుతుందని పంజ్ షేర్ సైన్యం భావిస్తుంది. ఈ సమయంలో తాము మరిన్ని ఆయుధాలు, శిక్షణ, శక్తి సామర్థ్యాలు పెంచుకునే అవకాశం దొరకనుంది. అలాగే విదేశీ శక్తుల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఈక్రమంలోనే మరికొన్ని రోజులు వీరిమధ్య భీకర పోరు తప్పకపోవచ్చనే తెలుస్తోంది. దీంతో మరికొన్ని వారాలు ఈ రెండు దళాలకు కూడా కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే పంజ్ షీర్ నేత అమ్రుల్లా సాలేహ్ తాజాగా తాలిబన్ సహా ఉగ్రవాదులపై పోరాటానికి తమ సైన్యానికి మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వారికి సహకారం అందే అవకాశం ఉండనుంది. ఏదిఏమైనా పంజ్ షేర్ ఇంకా తాలిబన్ల వశం కాలేదని తెలియడం అప్ఘన్లకు కొంత ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!