US-IRAN WAR: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి ఏర్పడింది. వచ్చే వారం ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ భారీ దాడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాడికి సంబంధించిన టార్గెట్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎన్ఎన్తో పాటు న్యూయార్క్ టైమ్స్ నివేదించాయి. శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో మళ్లీ ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ని తీవ్రతరం చేసేందుకు యూఎస్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత ఈ వార్తలు గుప్పుమన్నాయి.
ఇరాన్ కీలక లక్ష్యాల జాబితాను యూఎస్, అమెరికా సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయిల్ సైన్యం, యూఎస్ సెంట్రల్ కమాండ్(CENTCOM) అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. వచ్చే వారం నాటికి దాడిని ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న విధించిన కాల్పుల విరమణ ప్రకటించబడింది. అయితే, రెండు దేశాల మధ్య మాత్రం శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి భారీ దాడి చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, యుద్ధం తిరిగి ప్రారంభించాలని అమెరికాపై ఇజ్రాయిల్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో మిగిలి ఉన్న అణు కర్మాగారాలు, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఇదే కాకండా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ఈ యుద్ధంలో విజయం సాధించాలని అమెరికన్లకు చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి దాడికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
