Israel-Iran War: ‘‘ఆపరేషన్ సిందూర్’’ నుంచి యూఎస్, ఇజ్రాయిల్ పాఠాలు నేర్చుకున్నాయా.? ఇరాన్ యుద్ధంలో ఏం చేస్తున్నాయి..?
- ఇండియా స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఇజ్రాయిల్, యూఎస్..
- ఆపరేషన్ సిందూర్లో కిరాణా హిల్స్ దాడి లాగే ఇరాన్పై అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ వరసగా ఇరాన్పై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్లపై కూడా దాడులు చేస్తోంది. ముఖ్యంగా, యూఎస్ బేస్లను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో యూఎస్, ఇజ్రాయిల్ దళాలు ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ అనుసరించిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
కిరాణా హిల్స్ దాడే స్పూర్తి:
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత, పాక్ సైన్యం దాడికి పాల్పడితే, భారత్ పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
అన్నింటికన్నా ముఖ్యమైన దాడి ‘‘కిరాణా హిల్స్’’గా చెప్పబడుతుంది. నిజానికి కిరాణా హిల్స్పై దాడి చేసినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అంతర్జాతీయ నిపుణులు దాడి వాస్తవమని చెబుతున్నారు. ఈ దాడి తర్వాతే, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం ప్రాధేయపడింది.
కిరాణా హిల్స్ పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టే ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడి గుహాలో ఆయుధాలను నిల్వ చేస్తారు. భారత్ ఈ గుహకు ముఖద్వారాల వద్ద దాడులు చేసింది. దీంతో వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఈ దాడి చాలా ఖచ్చితత్వంతో జరిగింది. భారత్ సురక్షితంగా ఎలాంటి రేడియేషన్ ముప్పు, అణు ముప్పు లేకుండా దాడి చేసింది.
ఇదే పనిచేస్తున్న యూఎస్, ఇజ్రాయిల్ :
ఇరాన్ యుద్ధంలో కూడా యూఎస్, ఇజ్రాయిల్ ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. ఇరాన్ దశాబ్ధాలుగా భూగర్భంలో మిస్సైల్ సిటీలను నిర్మించింది. ఇందులోనే డ్రోన్లు, మిస్సైళ్లను దాచిపెడుతోంది. వీటిని దాడిన బంకర్లు చాలా బలంగా ఉన్నాయి. కానీ యూఎస్ ఇజ్రాయిల్ దళాలు వాటిని నాశనం చేయడానికి బదులుగా వాటి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద దాడులు చేస్తోంది. దీంతో లోపల ఉన్న మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలు బయటకు తీసువచ్చే ఛాన్స్ లేకుండాపోయింది. ఒక నివేదిక ప్రకారం, ఇరాన్ మిస్సైల్ , డ్రోన్ దాడులు దాదాపుగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాన్ బీ-2, బీ-52 బాంబర్లు భారీగా బాంబులు వేస్తూ బంకర్లను మూసేశాయి.
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!