US-Iran War: 40 రోజుల యుద్ధంతో అమెరికా సంవత్సరాల కష్టం వృథా..
- ఇరాన్ యుద్ధంతో భారీగా నష్టపోయిన అమెరికా..
- గల్ఫ్ ప్రాంతంపై బలహీనమైన ప్రభావం..
- మూడు దశాబ్ధాల అమెరికా శ్రమ నాశనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా ప్రపంచంలోనే గొప్ప మిలిటరీ శక్తి. అయితే, ఇరాన్ యుద్ధం తర్వాత యూఎస్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ యూఏఈని అడ్డుకున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయిల్, అమెరికా కలిసి దాడులు ప్రారంభించిన వారంలోపే ఇరాన్లో తమ పాలన వస్తుందని భావించాయి, కానీ ఇరాన్ సైన్యం అమెరికాను తీవ్రంగా దెబ్బతింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ యుద్ధం నుంచి ఎలా ఎగ్జిట్ కావాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు కాల్పుల విరమణ ప్రకటించి.. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ సహకారంతో శాంతి చర్చలకు సిద్ధమయ్యారు.
Read Also: Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్లో ఇజ్రాయిల్ భయాలు..
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
ఇదిలా ఉంటే, ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలో పవర్ బ్యాలెన్స్ను పూర్తిగా మార్చేసింది. ఇరాన్ను ఒక గొప్ప శక్తిగా మార్చింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్ దేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా, ఏన్నో ఏళ్లుగా అమెరికా నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఈ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలను ఇరాన్ సర్వనాశనం చేసింది. ఈ ప్రాంతంలోని సుమారు 12 స్థావరాలు ఇరాన్ దాడులకు గురయ్యాయి. ఇప్పుడు ఈ స్థావరాలను ఉపయోగించే స్థితిలో లేవని న్యూయార్క్ టైమ్స్ గతంలో నివేదించింది. అయితే, ఈ నష్టాల గురించి ట్రంప్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్లో అమెరికా వ్యవస్థల్ని ఇరాన్ ఒక నెలలో నాశనం చేసిందని అన్నారు. ఒకప్పుడు అమెరికన్ నేవీకి కేంద్రంగా పరిగణించిన బహ్రైయిన్లోని యూఎస్ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని ఇరాన్ టార్గెట్ చేసి దాడి చేసింది. ఈ యుద్ధం తర్వాత, గల్ఫ్లో అమెరికా పట్టు బలహీనపడింది. 1990 గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా ఆ ప్రాంతంలో విసత్రించింది. దాదాపుగా 19 పెద్ద సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 50,000 మంది సైనికుల్ని ఉంచింది. ఈ బలగాలు గల్ఫ్ దేశాల రక్షణ కోసం ఉద్దేశించబడినవి. అయితే, ఇప్పుడు ఇరాన్ వార్ తర్వాత ఇది చాలా బలహీనమైంది.
తాజావార్తలు
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..